Kantara మూవీ మరో బాక్సాఫీస్ రికార్డు.. కేజీఎఫ్2 కలెక్షన్లు తిరగరాసిన రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి, సప్తమీ గౌతమీ జంటగా నటించిన కంతార చిత్రం 50 రోజుల తర్వాత కూడా రికార్డులను తిరగరాస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. 2022లో రిలీజైన చిత్రాల్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా కంతార రికార్డును క్రియేట్ చేసింది. 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో ఇటీవల కేజీఎఫ్2 క్రియేట్ చేసిన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ చిత్రం అధిగమించింది. ఈ రికార్డు విషయంలోకి వెళితే..
కంతార చిత్రం తొలి రోజు నుంచే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకొన్నది. సినిమాను చూసిన రజనీకాంత్, కమల్ హాసన్, ధనుష్, ప్రభాస్, మధుర్ బండార్కర్, శిల్పాశెట్టి, ఇంకా చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. డిసెంబర్ 2వ తేదీన తులు భాషలోకి అనువాదం చేసి.. ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేయడం విశేషంగా మారింది.

కన్నడ సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. కేజీఎఫ్2 చిత్రం పూర్తికాలం థియేటర్ రన్లో 161.5 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రిలీజైన కంతార చిత్రం 172 కోట్ల రూపాయలు రాబట్టింది. కేజీఎఫ్ 2 చిత్రం 75 లక్షల టికెట్లు అమ్ముడుపోగా.. కంతార 100 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ రెండు చిత్రాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా కంతారా కలెక్షన్లను పరిశీలిస్తే.. దక్షిణాదిలో 260 కోట్లకుపైగా, ఉత్తరాదిలో 100 కోట్లు, ఓవర్సీస్లో 45 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్లో చేరింది. ఇక కంతార చిత్రం 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లతో కనకవర్షం కురిపించింది.


Click it and Unblock the Notifications











