Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
RRR రిలీజ్ రోజే KGF Chapter 2 విడుదల: అదిరిపోయే ప్లాన్ వేసిన యూనిట్
పేరుకు కన్నడ సినిమానే అయినా.. దేశ వ్యాప్తంగా విడుదలై.. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది 'కేజీఎఫ్ చాప్టర్ 1'. శాండిల్వుడ్ స్టార్ హీరో యశ్ హీరోగా.. స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే గుర్తుండిపోయే విధంగా ఆడింది. ఇందులో హీరోను ఎలివేట్ చేసి చూపించిన తీరుకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఇది కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అదే సమయంలో జాతీయ అవార్డులను సైతం దక్కించుకుని సత్తా చాటింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా తీస్తున్న విషయం తెలిసిందే.
'కేజీఎఫ్ చాప్టర్ 1' ఘన విజయాన్ని నమోదు చేయడంతో.. 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దానికి సీక్వెల్ను తీస్తున్నారు. కేజీఎఫ్ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్కు అధీరా నుంచి ఎలాంటి సవాళ్లు ఎదరయ్యాయి అన్న పాయింట్తో ఈ సినిమా రూపొందింది. ఇక, దీన్ని జూలై 16, 2021న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినా.. కరోనా ప్రభావం కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నారట.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, కరోనా రూపంలో మరోసారి ఆటంకం ఏర్పడడంతో దాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. దీంతో ఈ తేదీన 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తీసుకు రావాలని డిసైడ్ అయిందట ఆ చిత్ర యూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సంజయ్ దత్ విలన్గా చేస్తున్నారు. శ్రీనిథి శెట్టి హీరోయిన్గా చేస్తోంది