Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సీఎం కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్న 2.0 నిర్మాతలు
ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ 2.0 తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ వారు త్వరలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు సాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ గౌడ... తన తండ్రి సూచన మేరకు మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే నిఖిల్ తన కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని, ఈ చిత్రాన్ని లైకా వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
2016లో 'జాగ్వర్' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయమైన నిఖిల్ గౌడకు తొలి ప్రయత్నం ఫలించలేదు. అప్పట్లో రూ. 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. 2019లో సీతారామ కళ్యాణ అనే కన్నడ చిత్రం చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. నయనతార హీరోయిన్. తమిళ కమెడియన్ యోగి బాబు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.