twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్న 2.0 నిర్మాతలు

    |

    ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ 2.0 తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ వారు త్వరలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు సాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

    ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ గౌడ... తన తండ్రి సూచన మేరకు మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే నిఖిల్ తన కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని, ఈ చిత్రాన్ని లైకా వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

    Lyca Productions to make a film with CM’s son Nikhil Gowda

    2016లో 'జాగ్వర్' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయమైన నిఖిల్ గౌడకు తొలి ప్రయత్నం ఫలించలేదు. అప్పట్లో రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. 2019లో సీతారామ కళ్యాణ అనే కన్నడ చిత్రం చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.

    లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. నయనతార హీరోయిన్. తమిళ కమెడియన్ యోగి బాబు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

    English summary
    Karnataka Cheif Minister, Kumaraswamy’s son Nikhil Gowda is gearing up to kick-start his new project. Reportedly, Lyca Productions, who bankrolled a big budget film like 2.0 is going to produce this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X