Don't Miss!
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సీఎం కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్న 2.0 నిర్మాతలు
ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ 2.0 తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ వారు త్వరలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు సాగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిఖిల్ గౌడ... తన తండ్రి సూచన మేరకు మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే నిఖిల్ తన కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని, ఈ చిత్రాన్ని లైకా వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
2016లో 'జాగ్వర్' అనే మూవీ ద్వారా హీరోగా పరిచయమైన నిఖిల్ గౌడకు తొలి ప్రయత్నం ఫలించలేదు. అప్పట్లో రూ. 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. 2019లో సీతారామ కళ్యాణ అనే కన్నడ చిత్రం చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. నయనతార హీరోయిన్. తమిళ కమెడియన్ యోగి బాబు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.