Don't Miss!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ పాత్ర రమ్యకృష్ణకా? ఖుష్బూకా? సంచలన చిత్రం కోసం పోటీ!
విలక్షణ నటుడు ధనుష్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం పా పాండి. 2017లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్ర రీమేక్ హక్కులను తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకొన్నారు. కన్నడలో ఈ చిత్ర రీమేక్కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారమవుతున్నది.
కన్నడలో రాజ కిరణ్ పోషించిన పాత్రలో ప్రముఖ నటుడు అంబరీష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అంబి నినాద్ వయస్సైథో అనే టైటిల్ను పెట్టారు. తొలుత ఈ చిత్రంలో అంబరీష్ సరసన సుహాసిని మణిరత్నం నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. తాజాగా అంబరీష్ సరసన నటించే పాత్ర కోసం రమ్యకృష్ణ, ఖుష్భూ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
పా పాండి చిత్రంలో యంగ్ రాజ్ కిరణ్ పాత్రను ధనుష్ పోషించాడు. కన్నడంలో ధనుష్ పాత్రను కిచ్చ సుదీప్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుదీప్ స్వీయ నిర్మాణ సారథ్యంలో కిచ్చ క్రియేషన్స్లో రూపొందిస్తున్నారు. కన్నడ రీమేక్ కోసం గురుదత్త గనిగా అనే దర్శకుడిని రంగంలోకి దించారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నది.