Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేశారో విదితమే. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సంజనాను గతంలోనే బెయిల్ దొరికింది. ఆమెకు అనారోగ్య కారణాల రిత్యా బెయిల్ మంజూరు చేశారు. అయితే రాగిణి ద్వివేది విషయంలో మాత్రం బెయిల్ పలుసార్లు నిరాకరించారు.
డ్రగ్స్ కేసులో సబంధాలు, ఆ తరువాత వాట్సప్ చాట్, గ్రూపుల ద్వారా సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును స్పెషల్గా టేకప్ చేయడం, ఇందులో సినీ రాజకీయ ప్రముఖుల హస్తం ఉండటంతో అందరి దృష్టి పడింది. ఇప్పుడు సంజనా బెయిల్ బయటే తిరుగుతోంది. తాజాగా రాగిణి ద్వివేదికి కూడా బెయిల్ మంజూరు అయింది.
సుప్రీం కోర్టులో రాగిణి ద్వివేది తరుపున వేసిన బెయిల్ పిటీషన్ను పరిశీలించిన ధర్మాసనం షరుతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కర్ణాటక హైకోర్టులో పలు మార్లు బెయిల్ తిరస్కరణకు గుర కావడంతో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు, ఇప్పుడు రాగిణికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాత్రం బెయిల్ మంజూరు తీర్పుపై వ్యతిరకేంగా వాదనలు వినిపించినా ఫలితం దక్కలేదు.