Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేశారో విదితమే. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సంజనాను గతంలోనే బెయిల్ దొరికింది. ఆమెకు అనారోగ్య కారణాల రిత్యా బెయిల్ మంజూరు చేశారు. అయితే రాగిణి ద్వివేది విషయంలో మాత్రం బెయిల్ పలుసార్లు నిరాకరించారు.
డ్రగ్స్ కేసులో సబంధాలు, ఆ తరువాత వాట్సప్ చాట్, గ్రూపుల ద్వారా సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును స్పెషల్గా టేకప్ చేయడం, ఇందులో సినీ రాజకీయ ప్రముఖుల హస్తం ఉండటంతో అందరి దృష్టి పడింది. ఇప్పుడు సంజనా బెయిల్ బయటే తిరుగుతోంది. తాజాగా రాగిణి ద్వివేదికి కూడా బెయిల్ మంజూరు అయింది.
సుప్రీం కోర్టులో రాగిణి ద్వివేది తరుపున వేసిన బెయిల్ పిటీషన్ను పరిశీలించిన ధర్మాసనం షరుతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కర్ణాటక హైకోర్టులో పలు మార్లు బెయిల్ తిరస్కరణకు గుర కావడంతో సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు, ఇప్పుడు రాగిణికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాత్రం బెయిల్ మంజూరు తీర్పుపై వ్యతిరకేంగా వాదనలు వినిపించినా ఫలితం దక్కలేదు.