Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రాగిణి ద్వివేది డ్రగ్ కేసులో ట్విస్టు.. కన్నడ సర్కార్కు సుప్రీం కోర్టు ఝలక్
కర్ణాటకలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో చిన్న ట్విస్టు చోటుచేసుకొన్నది. మూడు నెలల క్రితం కర్టాటక రాష్ట్ర పోలీసుల జరిపిన సోదాల్లో షాకింగ్గా విషయాలు బయటకు వచ్చాయి. పలువురు సినీ తారలు నిషేధిత మాదక ద్రవ్యాల ఉపయోగించినట్టు ఆరోపణలు వచ్చాయి. పలు ఆరోపణలపై హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా తదితరులను అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హీరోయిన్ రాగిణి ద్వివేది సుప్రీకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఏమిటంటే..
90 రోజులుగా జైలులో
కర్ణాటక డ్రగ్స్ కేసులో 90 రోజులుగా జైలులో ఉంటున్న రాగిణి ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా జైలులో నిర్బంధించి తనకు బెయిల్ ఇవ్వడం లేదు అంటూ తన పిటిషన్లో పేర్కొన్నది. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ రాగిణి సుప్రీం కోర్టును కోరింది. ఈ క్రమంలో రాగిణి పిటిషన్పై విచారణ చేపట్టింది.
సుప్రీం కోర్టు విచారణ
నటి రాగిణి దాఖలు చేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, నవీన్ సిన్హా, కేఎం జోసెఫ్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో రాగిణికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
పబ్లిసిటీ కోసమే అరెస్ట్
హీరోయిన్ రాగిణి ద్వివేది తరఫున సిద్ధార్థ్ లుథ్రా తన క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. కేవలం మీడియా ట్రయల్స్, పబ్లిక్ అటెన్షన్ కోసమే అరెస్ట్ చేశారు. కేవలం ఆరోపణలపైనే తన క్లయింట్ను వేధిస్తున్నారు. సుమారు 90 రోజులుగా జైలులో ఉంచారు. తన క్లయింట్ రాగిణి బాధితురాలిగా మారింది. ఆమె నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
Recommended Video
కన్నడ తారలపై తీవ్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా, కన్నడ నటి రాగిణి ద్వివేది అరెస్ట్ తర్వాత పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ మాఫియా పోలీసుల కళ్లగప్పి తమ వ్యాపారాన్ని ఎలా చేశారు. పలువురు సినీ తారలకు ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి, సంజన, నిర్మాత శివ ప్రకాశ్ లాంటి పలుమార్లు దరఖాస్తు చేసుకొన్న బెయిల్ పిటిషన్లను కోర్టు బెంగళూరు కోర్టు తోసిపుచ్చింది. దాంతో రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.