Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
అర్థరాత్రి సైలెంట్గా ఇల్లు ఖాళీ చేసిన హీరోయిన్.. కారణం ఇదే, నెటిజన్ల ట్రోలింగ్!
సీనియర్ హీరోయిన్ రమ్య నటనకు కొంత గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో బిజీగా గడుపుతోంది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంతో రమ్య మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకుని రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటకలోని మాండ్య పట్టణంలో నివాసం ఉంటున్నారు. రాత్రికి రాత్రే ఇంటిని సైలెంట్ గా ఖాళీ చేసి వెళ్లిపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. రమ్య ఇల్లు ఖాళీ చేయడానికి అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి.
అంబరీష్ అంత్యక్రియలకు
కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతగానో గౌరవించే సీనియర్ నటుడు అంబరీష్ ఇటీవల మరణించారు. సౌత్ లోని సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబు ఇలా చాలా మంది అంబరీష్ మృతదేహానికి నివాళులు అర్పించారు. కానీ కర్ణాటకలోని ఉంటుంది నటి రమ్య మాత్రం అంబరీష్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. అంబరీష్ ఆత్మకు శాంతి కలగాలని కేవలం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.
దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
దీనితో అంబరీష్ అభిమానులు, నెటిజన్లు రమ్యని టార్గెట్ చేస్తూ విమర్శలతో చెలరేగిపోయారు. రమ్యపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగింది. తాను సర్జరీ చేయించుకున్న కారణంగానే అంత్యక్రియలకు హాజరు కాలేదని రమ్య వివరణ ఇచ్చినా నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. రమ్యపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంబరీష్ తనకు గురువులాంటివారని రమ్య ఓ సంధర్భంలో తెలిపింది. ఆ మాటలని నెటిజన్లు ఆమెకు గుర్తు చేస్తున్నారు.
సీనియర్ హీరోయిన్కు అరుదైన వ్యాధి.. సోషల్ మీడియాలో వెల్లడి.. అందుకే రాలేదని..
సైలెంట్గా ఇల్లు ఖాళీ చేసి
అంబరీష్ అంత్యక్రియలకు హాజరు కాకుండా వివాదంలో చిక్కుకున్న రమ్య మరోమారు వార్తల్లో నిలిచింది. మాండ్య పట్టణంలో తాను నివాసం ఉంటున్న ఇంటిని సైలెంట్ గా ఖాళీ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ కారణాల వలనే రమ్య ఇంటిని ఖాళీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా రమ్య ఆ ఇంటిలో అద్దెకు నివసిస్తోంది.
రాజకీయాల్లో ఎదగాలని
రాజకీయాల్లో రాణించాలని భావించిన రమ్య మండ్య పట్టణం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించింది. కానీ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో రమ్య మనస్తాపానికి గురై ఇక మాండ్యలో తనకు పనిలేదని ఇల్లు ఖాళీ చేసినట్లు చెబుతున్నారు. పలు చిత్రాల్లో హీరోయిన్ గా రాణించిన రమ్య రాజకీయాల కోసం నటనకు దూరమైంది.