Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో రెండు భాషల్లోకి హీరో రాసిన కథ.. రీమేక్ చేసేది ఎవరంటే?
"మనిషన్నాక కాస్తంత కళా పోషణ ఉండాలి" అని రావుగోపాల్ రావు గారు సరదాకు చెప్పలేదు. ఎంత సేపు ఓకేపని చేస్తుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది. అందుకే అప్పుడప్పుడు కొత్త తరహాలో వేరే కళలపై కూడా దృష్టి పెట్టాలి. ఆ విధంగా మన సీనియర్స్ ఎప్పుడో సక్సెస్ అయ్యారు గాని నేటితరం యాక్టర్స్ ఒకే పనిలో నిమగ్నమై రొటీన్ గానే కెరీర్స్ ని కొనసాగిస్తున్నారు. అయితే అడవి శేష్ మాత్రం డిఫరెంట్ గా తన టాలెంట్ ని బయటపెడుతున్నాడు.
ఖర్మ సినిమాతో దర్శకుడిగా హీరోగా ట్రై చేసి దెబ్బ తిన్న శేష్ ఆ తరువాత ఆ పనులకు దూరంగా ఉంటూ కేవలం ఒక యాక్టర్ అనే పద్దతిలో నడుచుకున్నాడు. ఇక ఆ తరువాత మెల్లగా మళ్ళీ ఒక్కొక్కటిగా తన టాలెంట్ ని వెలికి తీస్తున్నాడు. 'ఎవరు' సినిమా ఫుల్ స్క్రిప్ట్ ని సొంతంగా రెడీ చేసుకోని వేరొకరితో డైరెక్షన్ చేయించి సక్సెస్ అయ్యాడు శేష్. పరభాషా సినిమాల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న ఆ కథ కోసం ఇప్పుడు మరికొంత మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కన్నడలో ఇప్పటికే ఒక హీరో రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. కన్నడ యువ హీరో దిగంత్.. శేష్ చేసిన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో హైలెట్ గా నిలిచిన రెజీనా పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇకపోతే తెలుగులో 'ఎవరు' సినిమాకు పని చేసిన కొంతమంది టెక్నీషియన్స్ కన్నడ రీమేక్ కోసం పని చేయబోతున్నారట. అలాగే తమిళ్ లో కూడా ఎవరు సినిమాను రీమేక్ చేసేందుకు కొంత మంది దర్శకులు ట్రై చేస్తున్నట్లు సమాచారం.