Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రముఖ నటుడికి రోడ్డు ప్రమాదం.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?
ఇటీవల, జాతీయ అవార్డు గ్రహీత కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదం తర్వాత ఆయన పరిస్థితి విషమంగా మారడంతో మరియు వైద్యులు అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, వారు అతనిని రక్షించలేకపోయారు. ఇప్పుడు మరో నటుడి కుమారుడు ప్రమాదం బారిన పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
ఆ నటుడి కుమారుడికి యాక్సిడెంట్
బెంగళూరు-హైదరాబాద్ హైవే పై మంగళవారం శాండిల్ వుడ్ నటుడు జగ్గేష్ కుమారుడు గురురాజ్ వెళుతున్న కారు ప్రమాదానికి గురయింది. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో గురురాజ్ మరణం నుండి తప్పించుకోగలిగారు. గురురాజ్ జగ్గేష్ పెద్ద కుమారుడు. అందుతున్న సమాచారం మేరకు గురురాజ్ కారు చెట్టులోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తిన్నది.
ఎక్కడ జరిదిందంటే
ఈ ప్రమాద సమయంలో గురురాజ్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియ లేదు. ఇక ఈ అంశంలో ఎవరూ ఆందోళన చెందవద్దని నటుడి కుటుంబం నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇక గురురాజ్ ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఒక ప్రముఖ కన్నడ టీవీ నివేదిక ప్రకారం, చిక్కబల్లాపూర్ తాలూకాలోని అగలగుర్కి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
టైర్ బ్లాస్ట్ తో
ఈ సంఘటన చిక్కబల్లాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు టైర్లు పేలిన తర్వాత కారు అదుపుతప్పి చెట్టును గుద్దుకోవడం తో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఈ సంఘటనపై నటుడు జగ్గేష్ ట్విట్టర్లో కంగారు పడవద్దని పేర్కొన్నారు.
రంగనాయకతో ప్రేక్షకుల ముందుకు
ఇటీవల, జగ్గేష్ రంగనాయక సినిమా అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఆ సినిమా అనేక సంచలనాలకు కేంద్ర బించువు అయింది. అయితే COVID-19 సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా షూట్ ఆగిపోగా త్వరలో షూటింగ్ ప్రారంభించవచ్చని అంటున్నారు. నిజానికి గతంలోనే దర్శకుడు గురుప్రసాద్ జూలై 15 లోగా తమ యూనిట్ షూట్ చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
హీరోగా ఎంట్రీ
తమిళ చిత్రం 7 జి రెయిన్బో కాలనీకి రీమేక్ అయిన గిల్లి సినిమాతో గురు రాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గిల్లి, సంక్రాంతి, పైపోటీ, మాస్ లీడర్, విష్ణు సర్కిల్ లాంటి సినిమాలతో కన్నడ ప్రేక్షకులను ఆయన మెప్పించాడు.