Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హానీమూన్ తర్వాత బిజీగా సాయేషా.. క్రేజీ హీరోతో రొమాంటిక్ సీన్లు
తమిళ హీరోయిన్ సాయేషా పెళ్లి తర్వాత మళ్లీ షూటింగ్తో బిజీగా మారింది. గతనెల తమిళ నటుడు ఆర్యతో వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆర్య, సాయేషా తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత హానీమూన్ కోసం విదేశాల్లో పర్యటించారు. ఇటీవల హానీమూన్ ముగించుకొని వచ్చిన సాయేషా యువరత్న అనే కన్నడ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వీరి మధ్య రొమాంటిక్ సీన్లను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
సాయేషాకు ఇది తొలి కన్నడ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఇదిలా ఉండగా, సూర్య నటించే కాప్పన్ అనే చిత్రంలో కూడా సాయేషా నటిస్తున్నది. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రంలో తన భర్త కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయేషా తెలుగులో అఖిల్ చిత్రం ద్వారా చిత్ర సీమకు పరిచయమైన సంగతి తెలిసిందే.