Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
తెలుగు, కన్నడ చిత్రాలతో విశేషంగా ఆకట్టుకొన్న హీరోయిన్ రక్షిత పెళ్లి తర్వాత అనూహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడితో కలిసి చేసిన ఇడియెట్ సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్తో పెళ్లాం ఊరెళ్లితే.. మహేష్ బాబుతో నిజం, నాగార్జునతో శివమణి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయారు.
ఆకాంక్ష శర్మ.. ఓ వైపు ట్రెడిషినల్ లుక్ మరోవైపు హాట్ లుక్
అనంతరం చిరంజీవితో అందరివాడు, బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్రావాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత కన్నడలో ఫుల్టైమ్ నిర్మాతగా మారిపోయారు. ప్రస్తుతం ఏక్ లవ్ యూ అనే చిత్రాన్ని నిర్మించి తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తాను నిర్మించిన ఏక్ లవ్ యా చిత్రంలో స్వయంగా తన సోదరుడు రానాను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. కన్నడ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకొన్న హీరోయిన్ రచితా రామ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే విడుదల చేసిన ఏక్ లవ్ యాలోని తొలి పాట సంగీత ప్రియులను ఆకర్షించడంతో సూపర్ హిట్ అయ్యింది. సుమారు 5 మిలియన్ల వ్యూస్కుపైగా సాధించింది. ఉగాది పండుగను పురస్కరించుకొని ఏక్ లవ్ యా' మూవీ నుంచి కాలాన్ని మరచి అనే పాటను సెకండ సింగిల్గా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను స్వయంగా చిత్ర దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం.