Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
డ్రగ్ రాకెట్లో మరో ఇద్దరు హీరో, హీరోయిన్ల పేర్లు.. వివేక్ ఒబేరాయ్ మరిది ఇంట్లో సోదాలు
కన్నడ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ తారలతోపాటు పలువురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించిన విషయం తెలిసిందే. ఈ సంచలన అరెస్టుల నేపథ్యంలో మరో ఇద్దరు సినీ తారలకు పోలీసులు సమన్లు జారీ చేయడం కన్నడ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ సమన జారీ గురించి పూర్తి వివరాలు..
కన్నడ సినీ తారలు దిగంత్, ఐంద్రిత
కన్నడ
సినిమా
పరిశ్రమకు
సంబంధించిన
డ్రగ్
రాకెట్
కేసులో
హీరో,
హీరోయిన్లు
దిగంత్
మంచాలే,
ఐంద్రిత
రేకు
సమన్లు
జారీ
చేశారు.
సెప్టెంబర్
16వ
తేదీన
బెంగళూరులోని
సెంట్రల్
క్రైమ్
బ్రాంచ్
పోలీసుల
ముందు
విచారణకు
హాజరు
కావాలని
సమన్లలో
పేర్కొన్నారు.
దీంతో
మరోసారి
కన్నడ
సినీ
పరిశ్రమ
ఉలిక్కిపడింది.
పాపులర్ దిగంత్, ఐంద్రిత జంటకు
దిగంత్
మంచాలే,
ఐంద్రిత
రే
2018లో
ప్రేమించి
పెళ్లి
చేసుకొన్నారు.
కన్నడ
పరిశ్రమలో
పాపులర్
సినీ
జంటగా
ఓ
పేరుంది.
దిగంత్
కన్నడ
పరిశ్రమలో
సీనియర్
నటుడిగా
రాణిస్తున్నారు.
ఐంద్రిత
దాదాపు
30
చిత్రాల్లో
నటించి
గణనీయమైన
అభిమానులను
సొంతం
చేసుకొన్నారు.
ఇలాంటి
పాపులర్
జంట
పేర్లు
డ్రగ్
రాకెట్లో
తెరపైకి
రావడం
సంచలనంగా
మారింది.
వివేక్ ఒబేరాయ్ మరిది ఇంట్లో సోదాలు
కన్నడ
పరిశ్రమలో
క్రైమ్
బ్రాంచ్
అధికారుల
సోదాలు
కొనసాగుతూనే
ఉన్నాయి.
కన్న
మాజీ
మంత్రి
జీవరాజ్
అల్వా
కుమారుడు
ఆదిత్య
అల్వా
నివాసంలో
సోదాలు
నిర్వహించారు.
హెబ్బల్లోని
ఆదిత్య
నివాసంలో
సోదాలు
నిర్వహించారు.
ఆదిత్య
అల్వా
బాలీవుడ్
నటుడు
వివేక్
ఒబేరాయ్కి
మరిది
కావడం
గమనార్హం.
ఆదిత్య
అల్వాని
12వ
నిందితుడిగా
చేర్చినట్టు
జాయింట్
కమిషనర్
తెలిపారు.
Recommended Video
సెంట్రల్ జైలుకు రాగిణి తరలింపు
బెంగళూరు డ్రగ్ రాకెట్ కేసులో 14 రోజుల కస్టడీలో ఉన్న రాగిణి ద్వివేదిని సెంట్రల్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 4వ తేదీన అరెస్ట్ కాబడిన రాగిణికి మరో రెండు రోజుల కస్టడీ ఉంది. ఇక సంజన గల్రానీ, వీరేన్ ఖన్నా తదితరులు పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఇంకా పలువురి పేర్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం.