Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరో సుదీప్కు ఎదురుదెబ్బ.. అరెస్ట్కు నాన్ బెయిలబుల్ వారెంట్
విలక్షణ నటుడు, కన్నడ హీరో సుదీప్ కిచ్చాకు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ యజమాని ఫిర్యాదు చేసిన కేసుకు గైర్హాజరు కావడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు నోటీసులు పంపినా హాజరు కాకపోవడంతో చిక్ మంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన సుదీప్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే...
హీరో సుదీప్పై కేసు ఇలా
కర్ణాటకలోని చిక్ మంగళూరులోని ఓ కాఫీ ప్లాంటేషన్లో షూటింగ్ సంఘటన సుదీప్కు సమస్యగా మారింది. గతలో కన్నడ టెలివిజన్ రియాలిటీ షో కోసం సుదీప్కు సంబంధించిన కిచ్చా క్రియేషన్స్ కాఫీ ఎస్టేట్లో షూటింగ్ జరిపింది. ఆ సందర్భంగా రూ.1.80 కోట్లు పారితోషికంగా చెల్లిస్తాననే ఒప్పందం జరిగింది. అయితే కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. మిగితా మొత్తం ఎగవేతకు పాల్పడ్డారని కాఫీ ఎస్టేట్ యజమాని కేసు నమోదు చేశారు.
ఆస్తి ధ్వంసం, మోసం అంటూ
తనకు జరిగిన అన్యాయంపై కిచ్చా క్రియేషన్స్పైనా, డైరెక్టర్ మహేష్పై ఎస్టేట్ యజమాని తొలుత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సివిల్ పరిధిలోకి వస్తుండటంతో ఎస్పీ సలహా మేరకు బాధితుడు కోర్టును ఆశ్రయించారు. తనకు చెల్లించాల్సిన రుసుము చెల్లించకుండా మోసం చేశారు. తన కాఫీ తోటను, వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారు అని ఎస్టేట్ యజమాని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెదిరింపులకు పాల్పడ్డారని
తనతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తన కాఫీ ఎస్టేట్స్లో షూటింగ్ కోసం ఎస్టేట్ నిర్మించారు. షూటింగ్ నిర్వహించినందుకు గాను చెల్లించాల్సిన మొత్తం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరిగేలా చూడాలి అని యజమాని కోర్టును వేడుకొన్నారు. దీంతో చిక్ మగళూరులోని జెఎంఎఫ్సీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
సుదీప్కు నాన్ బెయిలబుల్ వారెంట్
చిక్ మంగళూరులోని జెఎంఎఫ్సీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసినప్పటికీ సుదీప్ గానీ, ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు స్పందించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 22 తేదీలోగా సుదీప్ ఆచూకీ తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరుచాల్సింది అని కర్ణాటక పోలీసులను కోర్టు ఆదేశించింది. సుదీప్కు నాన్ బెయిలబుల్ వారెంట్లు రిలీజ్ కావడంతో కన్నడ సినీ పరిశ్రమలో ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది.