Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కేజీఎఫ్ 2 డబుల్ ట్రీట్ ఇస్తుంది: యష్, అత్యంత భారీ బడ్జెట్, బాలీవుడ్ నటులతో ప్రారంభం
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కె.జి.ఎఫ్- చాప్టర్ 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. కేజీఎఫ్ ఘనవిజయం నేపథ్యంలో కేజీఎఫ్ సీక్వెల్పై భారీ అంచనాలేర్పడ్డాయి. అలాంటి సినిమా ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..
కేజీఎఫ్ రూ.250 కోట్ల కలెక్షన్లు
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. దక్షిణాదిలో బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకున్న సిరీస్ ఇది. కన్నడలో రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం హిందీలో ఏకంగా రూ.45 కోట్లు పైగా వసూలు చేయడం ఓ సంచలనం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించింది.
కెజిఎఫ్ చాప్టర్ 2 పూజా కార్యక్రమాలతో
కెజిఎఫ్ చాప్టర్ 2 `చిత్రాన్ని మార్చి 13న బెంగళూరు కంఠీరవ స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఉదయం 9.30కు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తనయుడు.. `కెజిఎఫ్ 2` ఎగ్జిక్యూటివ్ నిర్మాత కైకాల రామారావు, చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్, కథానాయిక శ్రీనిధి శెట్టి తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
2020 వేసవిలో విడుదల
మార్చి నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్టోబర్ తో చిత్రీకరణ పూర్తవుతుంది. నవంబర్ నుంచి సీజీ వర్క్ సహా నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తారు. 2020 వేసవి కానుకగా సినిమా రిలీజవుతుంది. చాప్టర్ 1లో నటించిన స్టార్లు అంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖ స్టార్లు ఇందులో నటిస్తున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్నది.
భారీ బడ్జెట్తో హోంబలే ఫిలింస్ నిర్మాణం
కేజీఎఫ్ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రాకింగ్ స్టార్ యష్ మాట్లాడుతూ.. కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని ఎంతో ప్రేమించి అభిమానించిన అభిమానులకు చాప్టర్ 2 డబుల్ ట్రీట్ ఇస్తుంది అని తెలిపారు.