Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
షాకిస్తున్న ‘కెజిఎఫ్’ ట్రైలర్...ఈ మధ్య కాలంలో ఇలాంటిది చూసుండరు!
కన్నడ సినిమాలకు తెలుగునాట ఆదరణ తక్కువే. అయితే తాజాగా విడుదలైన ఓ కన్నడ మూవీ ట్రైలర్ అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సినిమాలోని పాయింట్... మేకింగ్ స్టైల్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు 'వారాహి చలన చిత్రం' అధినేత సాయి కొర్రపాటి.
1960 నుంచి 1980 మధ్య కాలంలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ట్రైలర్ ప్రజంట్ చేసిన తీరు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
బానిసల్లా బ్రతికే సమూహం గురించేనా?
ట్రైలర్ వినిపించే డైలాగులు సినిమా ఒక కొత్త పంథాలో సాగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ‘బయల్దేరాడు... వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. తీసుకెల్లే చోటు గురించి తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా తెలియదు' అనే డైలాగ్స్ బట్టి ఎక్కడున్నామో తెలియకుండా బానిసల్లా బ్రతికే జన సమూహం గురించి సినిమా సాగుతుందని స్పష్టం చేస్తున్నాయి.
డైలాగులు అదిరిపోయాయి
‘కేవలం గిన్నెడు రక్తం చూసి ఇంతలా భయ పడుతున్నావంటే ఇక ముందు జరుగబోయే రక్తపాతాన్ని చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో... భావోద్వేగాలకు లొంగిపోకు, ఈడ వాటికి విలువ లేదు... అనే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ ప్రపంచాన్నే గెలవొచ్చు
"నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు"అనే డైలాగ్స్ సినిమా ఓ రేంజిలో ఉంటుందనే అంచనాలు పెంచింది.
కెజిఎఫ్
ఈ చిత్రంలో యష్, శ్రీనిధి శెట్టి, అయ్యప్ప, బి సురేష్, శ్రీనివాస్ మూర్తి తదితరుల కన్నడ నటులు నటిస్తున్నారు. వియయ్ కరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 21వ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.