Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టార్ హీరోపై బ్యాన్ ఎత్తివేత.... నిరసనగా నలుగురు హీరోయిన్ల రాజీనామా!
మలయాళ హీరోయిన్ కిడ్నాప్, సెక్సువల్ హరాస్మెంట్ కేసులో కేరళ స్టార్ హీరో దిలీప్ గతంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ సంఘటన తర్వాత అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ) ఆయనపై బ్యాన్ విధించింది. 85 రోజుల పాటు జైల్లో గడిపిన దిలీప్ ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చారు.
Recommended Video
అయితే జైలు నుండి విడుదలైన దిలీప్ ఇటీవల (అమ్మ) మీటింగుకు హాజరయ్యారు. ఆయనపై విధించిన నిషేధాన్ని సైతం ఎత్తివేయడంతో అంతా షాకయ్యారు. పోలీసుల నుండి కానీ, కోర్టు నుండి కానీ అతడికి ఎలాంటి క్లీన్ చిట్ రాక పోయినా..... బ్యాన్ ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిరసనగా బాధిత హీరోయిన్తో మరో ముగ్గరు హీరోయిన్లు రాజీనామా చేశారు.
నలుగురు హీరోయిన్ల రాజీనామా
ఈ పరిణామాల నేపథ్యంలో తాను ‘అమ్మ' నుండి తప్పుకుంటున్నట్లు బాధిత హీరోయిన్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. భావనకు సంఘీభావంగా మరో ముగ్గరు మలయాళం హీరోయిన్స్ రమ్య నంబీశన్, రీమా కలింగల్, గీతూ మోహన్దాస్ ‘అమ్మ' నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
‘అమ్మ' హెడ్ మోహన్ లాల్ ఎలా స్పందిస్తారో?
బాధితురాలుకు అండగా న్యాయం వైపు ఉండాల్సిన ‘అమ్మ' దిలీప్కు మళ్లీ సభ్యత్వం కల్పించడంపై వీరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత నటితో పాటు నలుగురు హీరోయిన్లు ‘అమ్మ' నుండి తప్పుకోవడంపై అసోసియేషన్ హెడ్ మోహన్ లాల్ ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశం అయింది.
కొత్తగా సంఘం ఏర్పాటు
కేరళ నటీమణులు ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టవ్' అనే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ నాయకత్వం వహిస్తున్నారు. దిలీప్-కావ్యా మాధవన్ ఎఫైర్ వివాదంలో మంజు వారియర్కు బాధిత హీరోయిన్ సహాయం చేసిందనే కోపంతోనే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
2017 ఫిబ్రవరి 17న రాత్రి
2017 ఫిబ్రవరి 17న రాత్రి బాధిత హీరోయిన్ను ఆమె కారులోనే కిడ్నాప్ చేసి... రెండు గంటల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పల్సర్ సునీల్, అతడి గ్యాంగ్ను అరెస్టు చేశారు. వారితో ఈ పని చేయించింది దిలీప్ అనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.