Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భార్య మరణం కేసులో ప్రముఖ నటుడి కుమారుడి అరెస్ట్.. కస్టడీలో ఉన్ని రాజన్ పీ దేవ్
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన హత్య కేసులో ప్రముఖ నటుడు, దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు, నటుడు ఉన్ని పీ దేవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నీ పీ దేవన్ తన భార్య ప్రియాంకను హత్య చేసినట్టు తీవ్ర ఆరోపణలు తలెత్తడంతో ఈ కేసు మలయాళ సినీ పరిశ్రమలో సెన్సేషనల్గా మారింది. ప్రియాంకపై ఉన్ని దేవన్ గృహ హింసకు పాల్పడే వారు. ఆ కారణంగానే బలవన్మరణానికి ఆమె పాల్పడ్డారు అని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రియాంక తన మరణానికి ముందు మే 11వ తేదీన తన భర్త తనపై గృహ హింసకు పాల్పడుతున్నారని పిటిషన్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే ఆమె ఉరివేసుకొని మరణించడం అనుమానాలు రేకెత్తించాయి. ఆ క్రమంలో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కొన్ని రోజులుగా దర్యాప్తు చేశారు. అనంతరం త్రివేండ్ర పోలీసులు ఉన్నిని అరెస్ట్ చేశారు. ఎర్నాకులంలోని ఉన్ని ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొన్నారు. ప్రియాంక హత్య కేసులో ఉన్నిపై ఐపీసీ 498ఏ, 306 సెక్షన్లను నమోదు చేశారు.
నటుడు ఉన్నిరాజన్ విషయానికి వస్తే.. మలయాళంలో ప్రముఖ నటుడు, దివంగత రాజన్ పీ దేవ్ కుమారుడు. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమా ద్వారా రాజన్ పీ దేవ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనే విషయం తెలిసిందే. 2019లో ప్రియాంకను వివాహం చేసుకొన్నారు. ఆడు ఓరు భీకరాజీవియను అనే చిత్రం ద్వారా మాలీవుడ్లోకి ప్రవేశించారు. ఇది, రాక్షాధికారి బైజు, మాంధరం, జనమైత్రి చిత్రాల్లో నటించాడు.