Don't Miss!
- News
`గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి`: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్లో ఫుల్ క్లారిటీ
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రేవ్ పార్టీపై పోలీసుల మెరుపు దాడి.. యువ హీరోయిన్ అరెస్ట్..
ఇప్పటి వరకు బాలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలకు పరిమితమైన డ్రగ్స్ రాకెట్ కేసు వ్యవహారం ఇప్పుడు మాలీవుడ్ను తాకింది. ఓ రిసార్టులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకొన్న కేరళ పోలీసులు మెరుపదాడి చేసి ఓ హీరోయిన్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకు కేరళ పోలీసుల దాడుల్లో అరెస్ట్ అయిన హీరోయిన్ ఎవరంటే..

బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమలో
సినీ పరిశ్రమతో డ్రగ్స్ రాకెట్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో రియా చక్రవర్తికి ఉన్న డ్రగ్స్ లింకులు బయటపడటం.. ఆ తర్వాత ఎన్సీబీ అరెస్ట్ చేయడం సంచలనంరేపింది. ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో లింకులు బయటకు రావడంతో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలను అరెస్ట్ చేయడం తెలిసిందే.

మాలీవుడ్లో రేవ్ పార్టీ
తాజాగా మాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం బయటపడింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ జరుగుతున్నదననే సమాచారం అందుకొన్న పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. వగమాన్లోని క్లిఫ్ ఇన్ రిసార్టుపై జరిపిన దాడుల్లో బ్రిస్టీ బిస్వాస్ను అరెస్ట్ చేశారు. రిస్టార్టులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు. పలువురుని అరెస్ట్ చేసి మాలీవుడ్తో డ్రగ్స్ సంబంధాలను ఆరా తీస్తున్నారు.

ఏడు రకాల డ్రగ్స్ స్వాధీనం
ఇడుక్కి
జిల్లాలోని
ఓ
రిసార్టులో
సీక్రెట్గా
జరుగుతున్న
పార్టీపై
దాడులు
చేసిన
నేపథ్యంలో
భారీగా
డ్రగ్స్ను
స్వాధీనం
చేసుకొన్నట్టు
సమాచారం.
ఈ
పార్టీ
నుంచి
ఏడు
రకాల
డ్రగ్స్ను
స్వాధీనం
చేసుకొన్నట్టు
తెలిసింది.
ఎండీఎంఏ,
ఎల్ఎస్డీ,
గంజాయి,
ఎక్స్టసీ
పిల్స్,
ఎక్స్టసీ
పౌడర్,
చరస్,
హాషిస్
లాంటి
డ్రగ్స్ను
అధికారులు
స్వాధీనం
చేసుకొన్నట్టు
సమాచారం.
బిస్ట్రీ
బిస్వాస్
అరెస్ట్తో
మలయాళ
చిత్ర
పరిశ్రమ
ఒక్కసారిగా
ఉలిక్కిపడింది.

రేవ్ పార్టీలో 58 మంది
మలయాళ నటి బ్రస్టీ బిస్వాస్కు డ్రగ్స్ మాఫియాతో బలమైన సంబంధాలున్నాయనే విషయం బయటకు వచ్చింది. కేరళలోని థ్రిపునితురా ప్రాంతానికి చెందిన బ్రిస్టీ పట్టణం నుంచే డ్రగ్స్ సరఫరా జరిగినట్టు తెలుస్తున్నది. పోలీసులు దాడి చేసిన సమయంలో మొత్తం 58 మంది ఉన్నట్టు సమాచారం.