Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తల్లిదండ్రులు చేయాల్సిన పనిని పెద్ద కూతురు చేసింది.. సవతి తల్లి అయినా కూడా!
మలయాళీ స్టార్ హీరో దిలీప్ గత ఏడాది నుంచి వివాదాల్లోనిలుస్తున్నాడు. మలయాళీ నటిపై లైంగికంగా దాడి చేసిన ఘటనట్లో దిలీప్ ముద్దగా ఉన్నారు. కొంతకాలం జైలు ఉండి ప్రస్తుతం బెయిలుమీద బయట ఉన్నారు. ఇదిలా ఉండగా దిలీప్ కుమార్ మలయాళీ నటి కావ్య మాధవన్ ని 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండవ వివాహం. ఇటీవల విజయదశమి సందర్భంగా ఈ జంటకు పండండి పాప జన్మించింది. తాజాగా దిలీప్, కావ్య మాధవన్ దంపతులు తమ కుమార్తెకు నామకరణం చేశారు.
మహాలక్ష్మి
దిలీప్, కావ్య మాధవన్ తమ కుమార్తెకు మహాలక్ష్మి అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకని దిలీప్ తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ట్రెడిషనల్ దుస్తుల్లో ఉన్న దంపతులిద్దరూ తమ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ వారి కుమార్తె ఫోటో మాత్రం రివీల్ చేయలేదు. దిలీప్ కుమార్తె నామకరణానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
సవతి తల్లి బిడ్డకు
కావ్య మాధవన్ కుమార్తెకు పేరుపెట్టింది మరెవరో కాదు.. దిలీప్ పెద్ద కుమార్తె మీనాక్షి. దిలీప్, మంజువారీయర్ మొదటి సంతానమే మీనాక్షి. సవతి తల్లి అయినప్పటికీ కావ్య మాధవన్ తో మీనాక్ష్మి ప్రేమగానే ఉంటోందట. అందుకే తండ్రికి, కావ్య మాధవన్ కు తన బుజ్జి చెల్లికి మహాలక్ష్మి అని పేరు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. మీనాక్షి కోరిక మేరకు ఆ పేరునే ఖాయం చేశారు. ఈ విధంగా దిలీప్ కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి.
కేసులతో ఇబ్బందులు
మలయాళీ నటిని లైగికంగా వేధించిన కేసు ఇప్పటికి దిలీప్ ని వెంటండుతోంది. గత ఏడాది మలయాళీ స్టార్ హీరోయిన్ ని కారులో కిడ్నాప్ చేసి లైగికంగా హింసించిన ఘటనలో దిలీప్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన విషయంలో దిలీప్ మొదటి భార్య మంజు కూడా అతడిపై విమర్శలు గుప్పించింది.
విభేదాలతో
దిలీప్, మంజువారీయర్ 2015 లో విభేదాల కారణంగా విడిపోయారు. కొంత కాలంగా కావ్య మాధవన్ తో రిలేషన్ కొనసాగించిన దిలీప్ 2016 లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. పలు కుటుంబ కథా చిత్రాలతో దిలీప్ మలయాళీ ప్రేక్షకుల్లో భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా జరుగుతున్న మలయాళీ నటి కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.