Dulquer Salmaan కి కరోనా వైరస్ పాజిటివ్.. మహమ్మారిని తక్కువగా అంచనా వేయొద్దు.. జాగ్రత్త అంటూ
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. వరుసగా సినీ నటులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన సెలబ్రిటీలకు కరోనా సోకగా ఇప్పుడు మలయాళ హీరోలకు కరోనా సోకుతుంది. జనవరి 15న మమ్ముట్టికి కరోనా సోకగా తాజాగా ఆయన కుమారుడికి కరోనా సోకింది. ఆ వివరాల్లోకి వెళితే

మమ్ముట్టి త్వరగా కోలుకోవాలని
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి జనవరి 15న కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసే నాటికి ఆయన తన సినిమా షూటింగ్లో ఉన్నారు, దీంతో ఆయన అప్పటికప్పుడు షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసి ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మమ్ముట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

సురక్షితంగా ఉండాలి
జనవరి 15న కేరళలో మమ్ముట్టికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో పోస్ట్ చేసిన తన నోట్లో, తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, అయినప్పటికీ వైరస్ బారిన పడ్డానని వెల్లడించాడు. తనకు కొంచెం జ్వరం ఉందని, తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సమయంలో మాస్క్లను తప్పని సరిగా ఉపయోగించాలని ఆయన కోరారు.
దయచేసి పరీక్షించండి
ఇప్పుడు ఆయన ''నాకు కోవిడ్19 పాజిటివ్ అని తేలింది. నేను ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నాను మరియు తేలికపాటి ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నాను కానీ నేను బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా షూటింగ్ సమయంలో నాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, మీరు లక్షణాలను గమనించినట్లయితే, దయచేసి ఐసోలేట్ చేసి పరీక్షించండి. ఈ మహమ్మారి ముగియలేదు మరియు మనం అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మాస్క్ వేసుకుని సురక్షితంగా ఉండండి'' అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు.

తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్
మలయాళంలో పలు సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఉన్న దుల్కర్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. మహానటిలో ఆయన జెమినీ గణేశన్ పాత్రలో నటించారు. కురుప్ (2021), ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే, పరిణయం జనతా హోటల్ లాంటి సినిమాలు తెలుగులో కూడా విడుదల కావడంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
Recommended Video

తెలుగులో డైరెక్ట్ సినిమా
ప్యాన్ ఇండియా క్రేజ్ కోసం ఇప్పుడు దుల్కర్ ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్కు అనుబంధంగా స్థాపించిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను త్రిభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. 1964 కాలంలో జరిగే ఆర్మీ బేస్డ్ పీరియడ్ లవ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేయనున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని సమర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











