twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజీకి రమ్మంటూ టార్చర్.. అసభ్యకర మెసేజీలు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

    |

    మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల తాలూకు విషయాలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున బయట పడుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాల ఫలితంగా మహిళలు ధైర్యంగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బహిర్గతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళీ హీరోయిన్ గాయత్రి సురేష్ సినిమాల్లో తనకు ఎదురైన అసభ్య ఘటనల గూర్చి వివరించింది. వివరాల్లోకి పోతే

    టాలీవుడ్ సహా అన్ని భాషల్లో ఇదే సమస్య

    టాలీవుడ్ సహా అన్ని భాషల్లో ఇదే సమస్య

    అవకాశాల పేరిట మహిళలను వంచించడం అనేది ఒక్క తెలుగు సినిమా పరిశ్రమలోనే గాక హిందీ, తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో కూడా ఉందని ఇప్పటికే పలువురు నటీమణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మలయాళీ హీరోయిన్ గాయత్రి సురేష్ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు బయటపెట్టింది.

    సినిమాల్లోకి వచ్చిన కొత్తలో

    సినిమాల్లోకి వచ్చిన కొత్తలో

    సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తను అవకాశాల కోసం వెతికేదానినని అయితే ఆ సమయంలో కొందరు కాంప్రమైజ్ అవుతావా? రాజీకి రెడీయేనా? అంటూ మొబైల్‌లో రకరకాల సందేశాలు పంపించేవారని పేర్కొంది గాయత్రి సురేష్. అయితే ఆ మెసేజీలు పెట్టిన వారి పేర్లు ఆమె బయటకు చెప్పలేదు. అలాంటి వారందరికి నో అని చెప్పేశానని పేర్కొంది గాయత్రీ సురేష్.

    ఎన్నో మెసేజీలు.. అయినా

    ఎన్నో మెసేజీలు.. అయినా

    అవకాశాల కోసం కాంప్రమైజ్ కావాలని ఎన్ని మెసేజీలు వచ్చినా అలాంటి వాటి జోలికి పోకుండా కేవలం పట్టుదలతోనే ఎదగాలని భావించానని గాయత్రీ సురేష్ చెప్పుకొచ్చింది. ఆ కోవలోనే టాలెంట్ నిరూపించుకుంటూ, బాగా రాణిస్తూ సినిమాలు చేశానని ఆమె తెలిపింది. అయితే కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు కొంత తగ్గాయని గాయత్రీ సురేష్ చెప్పింది.

     బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి తప్పదు

    బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి తప్పదు

    అయితే సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళతో పోల్చితే, బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేసింది గాయత్రీ సురేష్. ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా కేవలం టాలెంట్‌ని మాత్రమే నమ్ముకొని పైకి రావాలని ఆమె చెప్పుకొచ్చింది. గాయత్రీ సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. గాయత్రీ సురేష్ నటించిన కొత్త సినిమా చిల్డ్రన్స్ పార్క్ అతిత్వరలో విడుదల కానుంది.

    English summary
    Malayalam actress Gayathri Suresh admitted that she was approached by producers inappropriately and was asked to compromise. Gayathri Suresh upcoming film Children's Park is getting ready for release, she opened up about casting couch in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X