Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రముఖ నటుడు అజిత్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో!
ప్రముఖ మలయాళీ నటుడు కొల్లం అజిత్ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యతో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడుపులో సమస్యలతో ఆయనకు తీవ్ర అనారోగ్యం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపుతప్పడంతో గురువారం తెల్లవారు జామున అజిత్ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.
అజిత్ 90 లలో సౌత్ మొత్తం ప్రముఖ నటుడిగా కొనసాగారు. అజిత్ తన కెరీర్ లో 500 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 'పరన్ను పరన్ను పరన్ను' అనే మలయాళీ చిత్రంతో 1983 లో సినీరంగప్రవేశం చేసారు. అజిత్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో మెరిశాడు. ఆయన కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించడం విశేషం.
కొల్లం అజిత్ కేవలం మలయాళీ చిత్రాల్లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. అజిత్ చివరగా 2012 లో ఇవాన్ అర్ధనారీ అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత ఆయన వెండి తెరకు దూరమయ్యారు. అజిత్ కు భార్య ప్రమీల. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. అజిత్ మృతితో మలయాళీ చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.