Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాలీవుడ్లో సరికొత్త రికార్డ్.. మోహన్ లావ్ క్రేజ్కు నిదర్శనమిదే!
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మళయాలి పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించాలన్నా, అందరూ ఆశ్చర్యపోయే కథకథనాలు సినిమాలను రూపొందించాలన్నా కూడా అది మాలీవుడ్ వల్లే అవుతుంది. అయితే అక్కడ మాత్రం కలెక్షన్లు అంతగా రావు. గట్టిగా వంద కోట్లు కొల్లగొట్టే సినిమాలు ఏడాదికి ఒకటి రెండు కూడా రావు. వంద కోట్లు కొల్లగొట్టాయంటే అది పెద్ద వండర్.
అలాంటి తరుణంలో మోహన్ లాల్ తన లూసిఫర్ సినిమాతో వంద కోట్లను కొల్లగొట్టేశాడు. అలా మొదటి సారి వంద కోట్ల రికార్డ్ మోహన్ లాల్ ఖాతాలోనే పడింది. అయితే తాజాగా మరో కొత్త రికార్డ్ మోహన్ లాల్ పేరిట నమోదు అయింది. మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం 2 సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఈ మూవీపై అన్ని వైపులా పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా 20 మిలియన్ల వ్యూస్ను క్రాస్ చేసింది. మాలీవుడ్ హిస్టరీలోనే ఇలా ఓ ట్రైలర్ 20 మిలియన్ల వ్యూస్ను కొల్లగొట్టడం విశేషమట. ఇదే విషయాన్ని మోహన్ లాల్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. దటీజ్ లాలెట్టాన్ అంటూ మోహన్ లాల్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. దృశ్యం సినిమాకు సీక్వెల్గా వచ్చిన పార్ట్ 2కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అన్ని భాషల ఇండస్ట్రీలు రీమేక్కు ముందుకు వచ్చాయి.