Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పద్మభూషణ్కు ఎంపికైన మోహన్లాల్ మీద దారుణమైన ట్రోలింగ్, కారణం..?
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. మలయాళం సినీ పరిశ్రమ నుంచి పద్మభూషణ్ గతంలో ప్రేమ్ నాజిర్కు దక్కగా, ఆ తర్వాత ఈ అవార్డు అందుకోబోతున్న రెండో వ్యక్తి మోహన్ లాల్.
అయితే ఈ పురస్కారానికి ఎంపికైన మోహన్ లాల్ మీద సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన వ్యతిరేకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వద్ద తన ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించి ఈ అవార్డు తెచ్చుకున్నారంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు.
ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో కొన్ని ట్రోల్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఈ సందర్భంగా కొందరు 'కాలాపానీ' చిత్రంలోని ఓ సన్నివేశంలో మోహన్ లాల్ బూట్లు నాకుతున్న ఫోటోలను షేర్ చేస్తుండటం చర్చనీయాంశం అయింది.
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి తాము నిర్వహిస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తన తల్లిదండ్రుల గౌరవార్థం మోహన్ లాల్ ఈ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ స్థాపించారు. అయితే ఫౌండేషన్ చాలా సంవత్సరాలుగా సంఘ్ పరివార్ లీడర్స్తో సన్నిహితంగా పనిచేయడం కూడా మోహన్ లాల్ పద్మ అవార్డు మీద విమర్శలకు రావడానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.
కేరళలోని బీజేపీ లీడర్లు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోహన్ లాల్ను ప్రచారంలోకి దింపుతారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని మోహన్ లాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.