Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
మళ్లీ వివాదంలో మోహన్లాల్.. లీగల్ నోటీసులు జారీ
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ మళ్లీ వివాదంలో ఇరుక్కొన్నారు. గత వారం మలయాళ నటి కిడ్నాప్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ వ్యవహారం కూడా ఆయనను ఇబ్బందుల్లో పెట్టింది. తాజాగా ఓ చేనేత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న నేపథ్యంలో సరికొత్త విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వ్యాపార ప్రకటనలో చరఖాను తిప్పడంపై సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన నటించిన వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపించింది. దాంతో రంగంలోకి దిగిన కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చర్యలకు ఉపక్రమించడమే కాకుండా నోటీసులు పంపడం వివాదంగా మారింది.
కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధ్యక్షురాలు శోభన జార్జి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాపార ప్రకటన ఉందని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో మోహన్లాల్కు, చేనేత కంపెనీకి నోటీసులు పంపించాం. స్వాతంత్ర్య పోరాటానికి చిహ్నమైన చరఖాకు సదరు ప్రకటనకు సంబంధం లేదు అని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాపార ప్రకటనల్లో మోహన్లాల్ నటించకుంటే మంచిదనేది నా సలహా అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, మోహన్లాల్ ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఒడియాన్, కయాంకులం, కొచున్ని, నీరాళీ అనే మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి.