వివాదంలో పృథ్విరాజ్ సుకుమారాన్ 'కడువ'.. బహిరంగ క్షమాపణలు చెప్పిన హీరో!
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన కడువ సినిమా మిశ్రమ సమీక్షలు అందుకుంది. అయితే, ఈ సినిమాలో దివ్యాంగ పిల్లల గురించి కించపరిచే డైలాగులు ఉన్నాయనే విషయం తెర మీదకు రావడంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో వాడిన డైలాగులపై వివరణ ఇవ్వాలని కోరుతూ దర్శకుడు షాజీ కైలాస్, నిర్మాతలు సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్లకు కేరళ రాష్ట్ర వికలాంగుల కమిషనర్ ఎస్హెచ్ పంచాపకేశన్ నోటీసులు జారీ చేశారు. ప్రేక్షకుల నుండి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్న క్రమంలో దర్శకుడు షాజీ కైలాస్, పృథ్వీరాజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.
మేకర్స్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించారు. ఇటీవల విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్రం కడువలోని ఒక సన్నివేశంలో వికలాంగ పిల్లల గురించి అవమానకరమైన డైలాగ్లు ఉన్నాయి. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో కడువా మేకర్స్ ఫేస్బుక్లో క్షమాపణ నోట్ని జారీ చేసి, అవమానకరమైన దృశ్యాన్ని తొలగించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా క్షమాపణలు చెప్పారు. ఆయన "క్షమించండి. అదొక తప్పు. మేము దానిని గుర్తించాము మరియు అంగీకరిస్తామని పేర్కొన్నారు. కడువలో జరిగిన ఒక సీక్వెన్స్లో, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన కడువక్కున్నెల్ కురువాచన్ పాత్ర మాట్లాడుతూ, వారి తల్లిదండ్రుల పూర్వ పాపాల ఫలితంగా భిన్నమైన పిల్లలు ఇటువంటి పరిస్థితులతో పుడుతున్నారని అన్నారు.

దీంతో 'కడువ'లో వికలాంగులను అవమానపరిచే డైలాగ్పై ఫిర్యాదుతో వికలాంగుల సంఘం రాష్ట్ర వికలాంగుల కమిషనర్ SH పంచపకేశన్ను సంప్రదించింది. ఆదివారం, దర్శకుడు షాజీ కైలాస్ తన సోషల్ మీడియా ద్వారా వికలాంగులను అవమానించే డైలాగ్పై బహిరంగ క్షమాపణలు చెప్పాడు. "ఆ డైలాగ్ పొరపాటు. ఇది మానవ తప్పిదంగా పరిగణించాలని నేను మీ అందరినీ అభ్యర్థించాలనుకుంటున్నాను. ఆ డైలాగ్లోని ఇతర పార్శ్వాల గురించి నేను కానీ స్క్రిప్ట్ రైటర్ జిను కానీ నటుడు పృథ్వీరాజ్ కానీ ఆలోచించలేదు. మేము హీరో విరోధి క్రూరత్వాన్ని హైలైట్ చేయడానికి మాత్రమే ఆ డైలాగ్ వాడాము"అని ఆయన రాసుకొచ్చాడు. అలాగే వికలాంగ పిల్లల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నటుడు పృథ్వీరాజ్ కూడా షాజీ కైలాస్ ఫేస్బుక్ పోస్ట్ను షేర్ చేయడం ద్వారా క్షమాపణలు చెప్పారు.


Click it and Unblock the Notifications











