Sunny Leone ఊరట.. చీటింగ్ కేసులో కేరళ కోర్టు కీలక ఆదేశం
చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, ఆమె సిబ్బందికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో జరుగుతున్న విచారణపై బుధవారం కేరళ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
చీటింగ్ కేసులో ఎర్నాకులం కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని సన్నిలియోన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి జియాద్ రెహ్మన్ ఏఏ స్వీకరించారు. ఆమె పిటిషన్ను పరిశీలించిన పిదప ఈ కేసులో క్రిమినల్ విచారణపై తదుపరి ఆదేశాల వరకు స్టే విధించారు.

తమ షోలో పాల్గొంటానని 36 లక్షలు తీసుకొన్నారు. ఆ తర్వాత స్టేజ్ ప్రదర్శనకు హాజరుకాకుండా వారు చీటింగ్ చేశారంటూ నిర్వాహకుడు శియాస్ కుంజుమహ్మద్ కేసు నమోదు చేశారు. దాంతో 2019లో సన్నీలియోన్, వెబర్, సిబ్బంది సునీల్ రజనీపై చీటింగ్ ఆరోపణలతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్ 34, 406, 420 కింద కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత తమపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి బందెరింపులకు పాల్పడ్డారు. మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ కేసులో విచారణకు కోర్టు పరిధి లేదు అని నిర్వాహకుడు శీయాస్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











