బీజేపీ ఎంపీ అభ్యర్థిగా స్టార్ హీరో.. కాషాయ పార్టీ కొత్త ఎత్తుగడ
మలయాళ సూపర్స్టార్ సురేష్ గోపిని కేరళలోని త్రిచూరు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. తాజాగా మరో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు జాబితాను పార్టీ ప్రకటించింది. గుజరాత్ నుంచి మహేసన అభ్యర్థిగా శారద బెన్ పటేల్, సూరత్ నుంచి దర్శన జర్దోస్ను ఎంపిక చేసినట్టు ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం సురేష్ గోపి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ అభ్యర్థులకు గట్టి పోటి ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఆయనను అభ్యర్థిగా బరిలోకి దించిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

90వ దశకంలో సురేష్ గోపి మలయాళ చిత్రసీమను ఓ ఊపు ఊపారు. వరుస హిట్లతో స్టార్ హీరోగా మారారు. అనంతరం నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
More from Filmibeat
suresh gopi bharatiya janata party bjp thrissur lok sabha constituency సురేష్ గోపి బీజేపీ త్రిచూరు లోక్సభ నియోజకవర్గం


Click it and Unblock the Notifications











