టాలీవుడ్లో చక్కటి అభిరుచి, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుల్లో సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన స్థానం. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలను నిర్మించడంలో ఆయన శైలి విభిన్నమైనది. దేశ స్వాతంత్రం తర్వాత దేశ ప్రజలందరిపై ఎక్కువ ప్రభావం చూపిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఈ అంశంపై వెంటనే స్పందించి సినిమాను రూపొందించడం అభినందనీయం. ఏటీఎం కష్టాలను, ఆ తర్వాత సమాజంలోని వివిధ వర్గాలపై పడిన ప్రభావాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. పాకిస్థాన్ టెర్రరిజం నుంచి కుహనా రాజకీయల వరకు, సంపన్నుల నుంచి సామాన్య ప్రజల వరకు పడిన కష్టాలను గంటన్నర నిడివి ఉన్న చిత్రంలో ప్రభావవంతంగా చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కథలో ఇంటెన్సిటీని చెప్పడంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం సినిమా రసవత్తరంగా సాగలేకపోయింది. పాత్రధారుల ఎంపిక ప్రధాన లోపం. అందుకు కారణం బడ్జెట్ పరిమితులు కావొచ్చు. కాకపోవచ్చు. కానీ కథలో ఉండే తీవ్రతను ప్రభావవంతంగా చెప్పడానికి నటీనటుల ఎంపిక, సాంకేతిక అంశాలు అవరోధంగా మారాయి.
సామాజిక బాధ్యత సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడి వద్దకు తీసుకుపోయే అంశాలు చాలా తక్కువే. కొంతమొత్తంలో ఓ సెగ్మెంట్కు చేరువ అయితే అందుకు ప్రధాన కారణం దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి అవుతారు. తాము అనుభవించిన నోట్ల కష్టాలను తెరమీద చూసుకొని ప్రేక్షకుడు సంతృప్తి చెందడంపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.
సామాజిక బాధ్యత సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని సగటు ప్రేక్షకుడి వద్దకు తీసుకుపోయే అంశాలు చాలా తక్కువే. కొంతమొత్తంలో ఓ సెగ్మెంట్కు చేరువ అయితే అందుకు ప్రధాన కారణం దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి అవుతారు. తాము అనుభవించిన నోట్ల కష్టాలను తెరమీద చూసుకొని ప్రేక్షకుడు సంతృప్తి చెందడంపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.