గీత గోవిందం (2018)(U/A)
గీత గోవిందం స్టోరి
గీత గోవిందం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ దేవరకొండ, రష్మిక మందన్న, నాగేంద్ర బాబు, రాహుల్ రవింద్రన్, అభయ్ బెతిగంటి తదితరులు ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం పరశురామ్ వహించారు మరియు నిర్మాత బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్ అందించారు.
కథ
జయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు.
ప్రేమతో దగ్గర కావాల్సిన గీత, గోవిందం మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి. గీతతో పెళ్లి కుదిరిన తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశాడు. విజయ్ గోవిందం చెల్లెలి పెళ్లి గీత అన్నతో జరిగిందా? తన దగ్గరి బంధువు (వెన్నెల కిషోర్)తో గీత కుదిరిన పెళ్లి ఎంత వరకు వెళ్లింది. ఆ తర్వాత రియలైజ్ అయిన విజయ్ గోవిందం గీతను దక్కించుకోవడానికి ఏం చేశాడు? ఈ చిత్రంలోని కథకు నిత్య మీనన్, అను ఇమ్మాన్యుయేల్ పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే గీత గోవిందం సినిమా కథ.