twitter

    జై సింహా స్టోరి

    జై సింహా సినిమా యాక్షన్ డ్రామా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోస్ రానా, మురళి మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ కుమార్ వహించారు మరియు నిర్మాత సి కల్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్ అందించారు. 

    కథ

    నరసింహా (బాలక‌‌‌ృష్ణ) వైజాగ్‌లో మెకానిక్. అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. నరసింహా, గౌరీ (నయనతార) గాఢంగా ప్రేమించుకొంటారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొంటాడు. పరిస్థితుల కారణంగా తాను ప్రాణంగా ప్రేమించిన గౌరీ మనసులో ప్రేమకు బదులు ద్వేషాన్ని పెంచాలనుకొంటాడు. అందుకోసం తన వద్ద పనిచేసే మంగ (హరిప్రియ)ను పెళ్లి చేసుకొని గౌరీకి షాకిస్తాడు. తనను మోసగించడాన్ని కారణంతో నరసింహాపై గౌరీ ద్వేషాన్ని పెంచుకొంటుంది. మంగ కవల పిల్లలకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది. తన కవల పిల్లల్లో ఒకరిని గౌరీ వద్దకు చేర్చి తాను తమిళనాడులోని కుంభకోణానికి వెళ్లిపోతాడు. తాను ఇష్టంగా ప్రేమించిన గౌరీకి నరసింహా ఎందుకు దూరమయ్యాడు? గౌరీ మనసులో ప్రేమను తుంచి ద్వేషాన్ని ఎందుకు రగిలించాడు? మంగ ఎందుకు చనిపోయింది? కుంభకోణానికి వెళ్లిన నరసింహాం జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచోసుకొన్నాయి? రౌడీలు (అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్)తో నరసింహాకు ఉన్న వైరం ఏమిటి? గౌరీ, నరసింహం మళ్లీ కలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే జై సింహా చిత్రం
    **Note:Hey! Would you like to share the story of the movie జై సింహా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X