ఒక్కడు మిగిలాడు (2017)(U/A)
Release date
10 Nov 2017
genre
ఒక్కడు మిగిలాడు స్టోరి
ఒక్కడు మిగిలాడు సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, అనీషా ఆంబ్రోస్, అజయ్ అండ్ ర్యూస్ నౌతాక్కి, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ అండ్ ర్యూస్ నౌతాక్కి వహించారు మరియు నిర్మాతలు ఎస్ ఎస్ రెడ్డి, లక్ష్మికాంత్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శివ నందిగామ స్వరాలు అందించారు.
కథ
ఇండియాలో జరిగే కథ నేపథ్యానికి వస్తే.....సూర్య (మంచు మనోజ్) పసి బిడ్డగా ఉన్నపుడే శ్రీలంక నుండి భారత దేశం వలస వస్తాడు. అందరినీ పోగొట్టుకున్న అతడిని తోటి శరణార్థులు చేరదీసి పెంచుతారు. స్థానిక యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్గా ఎదిగిన సూర్య.... ఇక్కడ శరణార్థుల పట్ల కొందరు రాజకీయ నాయకులు, స్వార్థపరులు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తాడు. శ్రీలంకలో ఇది మీ దేశం కాదు మీరు శరణార్థులు అంటున్నారు. భారత దేశం వస్తే ఇది మీ దేశం కాదు శరణార్థులు అంటున్నారు. మాకు దేశం అంటూ లేదా? మాకు ఎక్కడా స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా? అని పోరాడే పాత్ర సూర్య పాత్ర. పీటర్ (మంచు మనోజ్) తమిళ ప్రజల పక్షాన పోరాడే నాయకుడు. శ్రీలంక స్వాతంత్రం తర్వాత అక్కడి ప్రభుత్వం తమిళులను భారత దేశం నుండి వలస వచ్చిన శరణార్థులుగా పేర్కొంటూ వారిని బానిసలుగా చూస్తుంది. వారికి విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయ పరంగా తొక్కేస్తుంది. వారు చేసే అన్యాయాలు సహిస్తూ బానిసలుగా బ్రతకడం కంటే ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటం చేసి భావితరాలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుంటాడు. శ్రీలంకలో జరిగే యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం కంటే.... భారత దేశానికి శరణార్థులుగా వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలనుకునే వారిని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు పీటర్. పరాయి దేశం వలస వెళ్లినా అక్కడ శరణార్థులుగా బానిస బ్రతకు తప్పదు. ఇక్కడే మన స్వేచ్ఛ కోసం పోరాడితే భావితరాలకు మేలు జరుగుతుంది అని వాదిస్తుంటాడు. మరి సూర్యకు, పీటర్కు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie ఒక్కడు మిగిలాడు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు