రోగ్ (2017)
రోగ్ స్టోరి
రోగ్ (మరో చంటిగాడి ప్రేమ కథ) సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఇషాన్, ఏంజెలా క్రిస్లింజ్కి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు మరియు జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ బ్యానర్ పై డాక్టర్ సి ఆర్ మనోహార్, సి ఆర్ గోపి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునిల్ కౌష్యఫ్ స్వరాలు సమకుర్చరు.
కథ
చంటి (ఇషాన్) రఫ్ టఫ్ యువకుడు. కమిషనర్ చెల్లెలు అంజలి (ఏంజెలా), ఇషాన్ ప్రేమించుకొంటారు. కానీ కమిషనర్ తన చెల్లెలిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఐపీఎస్ అధికారి (సుబ్బరాజు)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటాడు. ఇది తెలుసుకొన్న చంటి కమిషనర్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. ఎదురొచ్చిన పోలీసులను చావబాదుతాడు. ఆక్రమంలో ఓ కానిస్టేబుల్ (సత్య) తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలోకి వెళ్తాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ చనిపోతాడు. ఆ ఘటనకు బాధ్యుడైన చంటికి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తుంది. చంటి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కష్టాల్లో ఉన్న కానిస్టేబుల్ కుటుంబం గురించి తెలుసుకోని వారికి అండగా నిలబడాలనుకొంటాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ చెల్లెలు అంజలి (మన్నారా చోప్రా) ప్రేమలో పడుతాడు. కానీ అంజలిని ఓ సైకో ( అనూప్ సింగ్ ఠాకూర్) వెంటపడి వేధిస్తాడు. ప్రేమించమని బలవంతం పెడుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో సైకో, చంటికి మధ్య జరిగిన ప్రేమ యుద్ధం ఎక్కడికి దారి తీసింది. సైకో బారిన పడిన అంజలిని చంటి ఎలా దక్కించుకొన్నాడు. కానిస్టేబుల్ కుటుంబానికి మేలు చేయడానికి చంటి ఏం చేశాడు. కమిషనర్ చెల్లెలు చంటిని ఎందుకు వదులుకొన్నదనే ప్రశ్నలకు సమాధానం రోగ్ సినిమా.