త్రిష లేదా నయనతార (2015)(A)
త్రిష లేదా నయనతార స్టోరి
త్రిష లేదా నయనతార సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జి వి ప్రకాష్ కుమార్, అనంది, మనిషా యాదవ్, సిమ్రాన్ బగ్గా, వి టి వి గణేష్, యుగి సెతు, రోబో శంకర్, ఆర్య, ప్రియ అనంద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అధిక్ రవిచంద్రన్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వరలు సమకుర్చారు.
కథ
జీవా(జీవి ప్రకాష్) అనే కుర్రాడి చుట్టూ కథ తిరుగుతుంది. మన హీరో ఇద్దరమ్మాయిలతో పాటు పెరుగుతాడు. రమ్య(ఆనంది), అదితి (మనీషా యాదవ్). ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ముగ్గురూ ఒకే రోజు, ఒకే సమయానికి, ఒకే హాస్పటల్ లో జన్మిస్తారు. కౌమార దశలోకి రాగానే స్కూల్ లో రమ్యతో ప్రేమలో పడతాడు జీవా. ఆమెకు కూడా అతనిపై (కామం?) సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అనుకోకుండా ఇద్దరూ విడిపోతారు. అందుకు కారణం జీవానే. ఓసారి జీవా తన ఫ్రెండుతో తన సెక్సువల్ అనుభవం గురించి చెబతాడు జీవా. ఈ విషయంలో స్కూల్ క్యాంపస్లో అందరికీ తెలిసిపోతుంది. రమ్యతో విడిపోయిన తర్వాత.... జీవా అదితికి దగ్గరవుతాడు కానీ ఆమెకు రెగ్యులర్ తాగే అలవాటు ఉంటుంది. దీంతో రెండో ప్రేమ వ్యవహారం కూడా విఫలం అవుతుంది. తర్వాత ఆ జీవా ఊరు విడిచి వేరే ఊరు వెళ్లి తన అంకుల్ వద్ద ఉంటాడు. మరి జీవా జీవితంలోకి మళ్లీ రమ్య వచ్చిందా? లేదా? అనేది తర్వాతి కథ.