twitter

    ఉంగరాల రాంబాబు స్టోరి

    ఉంగరాల రాంబాబు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, వెన్నేల కిశోర్, 
    మధు నంధన్, వేణు (జబర్దస్థ్), సత్యం రాజేష్, ఆర్ జె హేమంత్ 
    తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం క్రాంతిమాధవ్ వహించారు మరియు యూనైటేడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరిటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జిబ్రాన్ అందించారు.

    కథ

    రాంబాబు (సునీల్) 200 కోట్ల ఆస్తికి వారసుడు. వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పులపాలై ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. బాదాం బాబా(పోసాని) చూపిన దారిలో నడిచి రూ. 200 కోట్లు విలువైన బంగారం దొరకడంతో పోగొట్టుకున్న తన ఆస్తులన్నీ చేజిక్కించుకుని..... 200 బస్సులు కొని ట్రావెల్ సంస్థను మొదలు పెడతాడు. బాదాం బాబా సూచన మేరకు తనకు బాగా కలిసొచ్చే జాతకం ఉన్న సావిత్రి (మియా జార్జ్)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో రాంబాబు, సావిత్రి ప్రేమలో పడతారు. అయితే పెళ్లి జరుగాలంటే తన తండ్రి రంగ నాయర్(ప్రకాష్ రాజ్) అనుమతి తప్పనిసరి అంటుంది సావిత్రి. రంగ నాయర్ కేరళలో చెగునె పూగొండి వనం అనే గ్రామపెద్ద. కరడుగట్టిన కమ్యూనిస్ట్ లీడర్. క్యాప్టలిస్టు బుద్దులున్న రాంబాబు అంటే రంగనాయక్ కు అస్సలు నచ్చదు. మరి సావిత్రిని దక్కించుకోవడానికి వాళ్ల రంగనాయర్ పెట్టిన పరీక్షలు ఎలా పాసయ్యాడు? అనేది తెరపై చూడాల్సింది. 

     

    **Note:Hey! Would you like to share the story of the movie ఉంగరాల రాంబాబు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X