Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆది సాయి కుమార్ ‘శశి’ నుంచి రెండో పాట.. మరోసారి మత్తెక్కించేందుకు రెడీ
ఆది సాయి కుమార్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ హిట్ కొట్టలేకపోతున్నాడు. పేరు మార్చుకున్నాడు.. ప్రయోగాలు చేస్తున్నాడు.. కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు.. కానీ ఓ సరైన సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. అలా ఆది సాయి కుమార్ ఇప్పుడు శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కెరీర్ స్టార్టింగ్లొ వరించిన విజయాలు ఇప్పుడు కనుచూపు మేరకు కనిపించకుండాపోయాయి.
మామూలుగా ఓ సినిమా విడుదల కంటే ముందుగానే ట్రెండ్ అవ్వాలంటే ఆడియో బాగుండాలి. టీజర్, ట్రైలర్ వంటివాటితో హైప్ క్రియేట్ చేయాలి. మామూలుగా పాటలు బాగుంటే మాత్రం సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోతాయి. అలా శశి సినిమాపై ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. శశి సినిమా నుంచి వదిలిన మొదటి పాట ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఒకే ఒక లోకం నువ్వే అంటూ వచ్చిన పాట శశి సినిమాను సోషల్ మీడియాలో బాగానే నిలబెట్టేసింది.
అయితే ఇప్పుడు మరోసాటతో మత్తెక్కించేందుకు శశి యూనిట్ రెడీ అయింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేయించబోతోన్నట్టు ప్రకటించారు. దీంతానా దీంతానే అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 5న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మరి ఈ పాట కూడా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.