Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆది సాయి కుమార్ ‘శశి’ నుంచి రెండో పాట.. మరోసారి మత్తెక్కించేందుకు రెడీ
ఆది సాయి కుమార్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ హిట్ కొట్టలేకపోతున్నాడు. పేరు మార్చుకున్నాడు.. ప్రయోగాలు చేస్తున్నాడు.. కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు.. కానీ ఓ సరైన సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. అలా ఆది సాయి కుమార్ ఇప్పుడు శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కెరీర్ స్టార్టింగ్లొ వరించిన విజయాలు ఇప్పుడు కనుచూపు మేరకు కనిపించకుండాపోయాయి.
మామూలుగా ఓ సినిమా విడుదల కంటే ముందుగానే ట్రెండ్ అవ్వాలంటే ఆడియో బాగుండాలి. టీజర్, ట్రైలర్ వంటివాటితో హైప్ క్రియేట్ చేయాలి. మామూలుగా పాటలు బాగుంటే మాత్రం సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోతాయి. అలా శశి సినిమాపై ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. శశి సినిమా నుంచి వదిలిన మొదటి పాట ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఒకే ఒక లోకం నువ్వే అంటూ వచ్చిన పాట శశి సినిమాను సోషల్ మీడియాలో బాగానే నిలబెట్టేసింది.
అయితే ఇప్పుడు మరోసాటతో మత్తెక్కించేందుకు శశి యూనిట్ రెడీ అయింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేయించబోతోన్నట్టు ప్రకటించారు. దీంతానా దీంతానే అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 5న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మరి ఈ పాట కూడా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.