Don't Miss!
- News జనసేన అభ్యర్దుల పై పవన్ తాజా నిర్ణయం - కలిసొచ్చేనా..!!
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆది సాయి కుమార్ ‘శశి’ నుంచి రెండో పాట.. మరోసారి మత్తెక్కించేందుకు రెడీ
ఆది సాయి కుమార్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఓ హిట్ కొట్టలేకపోతున్నాడు. పేరు మార్చుకున్నాడు.. ప్రయోగాలు చేస్తున్నాడు.. కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు.. కానీ ఓ సరైన సక్సెస్ మాత్రం పలకరించడం లేదు. అలా ఆది సాయి కుమార్ ఇప్పుడు శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. కెరీర్ స్టార్టింగ్లొ వరించిన విజయాలు ఇప్పుడు కనుచూపు మేరకు కనిపించకుండాపోయాయి.
మామూలుగా ఓ సినిమా విడుదల కంటే ముందుగానే ట్రెండ్ అవ్వాలంటే ఆడియో బాగుండాలి. టీజర్, ట్రైలర్ వంటివాటితో హైప్ క్రియేట్ చేయాలి. మామూలుగా పాటలు బాగుంటే మాత్రం సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోతాయి. అలా శశి సినిమాపై ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. శశి సినిమా నుంచి వదిలిన మొదటి పాట ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఒకే ఒక లోకం నువ్వే అంటూ వచ్చిన పాట శశి సినిమాను సోషల్ మీడియాలో బాగానే నిలబెట్టేసింది.
అయితే ఇప్పుడు మరోసాటతో మత్తెక్కించేందుకు శశి యూనిట్ రెడీ అయింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేయించబోతోన్నట్టు ప్రకటించారు. దీంతానా దీంతానే అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 5న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. మరి ఈ పాట కూడా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.