Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎక్కడా తగ్గని పుష్ప.. మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే మొదటి సినిమాగా!
అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు సహా దక్షిణాది భాషల్లో మాత్రమే కాక హిందీలో కూడా సత్తా చాటింది. ఐతే ఈ సినిమా తాజాగా ఒక అరుదైన గుర్తింపు దక్కించుకుంది ఆ వివరాల్లోకి వెళితే
సూపర్ హిట్ గా
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్తో నిర్మించింది. నిజానికి ఈ సినిమా తొలుత ఒక సినిమాగానే ప్లాన్ చేశారు కానీ సినిమా షూటింగ్ దశలోకి వెళ్లాక సీన్లు అంతకంతకు పెరిగిపోతూ ఉండడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఆ మేరకు ఎగ్జిక్యూట్ చేశారు. అందులో భాగంగానే మొదటి భాగాన్ని గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయగా సూపర్ హిట్ గా నిలిచింది.
మారుమోగిపోయి
కేవలం సినిమా మాత్రమే కాదు సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. సినిమాల్లో ప్రతి పాట కూడా జనాలకి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో వచ్చే శ్రీవల్లి, దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మా ఊహ అంటావా ఇలా ప్రతిపాట కూడా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ కావడంతో ఆ సినిమాకు మంచి పేరు తీసుకురావడమే కాక జాతీయ స్థాయిలో కూడా పుష్ప పేరు మారుమోగిపోయింది.
అరుదైన రికార్డు
అయితే తాజాగా పుష్ప ఆల్బమ్ అన్ని సాంగ్స్ కలిపి 500 బిలియన్ వ్యూస్ దక్కించుకున్నట్లు సమాచారం. అంటే అన్ని పాటలు కలిపి అంటే 500 కోట్ల వ్యూస్ ను సాధించాయన్న మాట.ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ స్థాయిలో వ్యూస్ దక్కించుకోలేదని అంటున్నారు. ఆ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా ఒక అరుదైన రికార్డు సృష్టించి తెలుగు సినిమా సత్తా మరోసారి దేశవ్యాప్తంగా చాటి చెప్పినట్లు అయింది.
రెండో వారం నుంచి
ఇక మరోపక్క పుష్ప సినిమా విడుదలై సూపర్ హిట్ తెచ్చుకోవడంతో రెండో భాగం మీద కూడా ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండో భాగం మీద ప్రస్తుతం సుకుమార్ పని చేస్తున్నారు. ఆయన ఒక టీం తో ఆడిషన్స్ జరిపిస్తూ మరో టీం తో స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.
నార్త్ ఆడియన్స్ కి
ఈ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నార్త్ లో కూడా భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించాలనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పలు రకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కానీ యూనిట్ మాత్రం దేనిని ధృవీకరించడం లేదు అలాగని ఖండించడం లేదు.