అమ్మ బాబోయ్ చంపేసింది.. పైన పటారం అంటోన్న అనసూయ
అనసూయ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చావు కబురు చల్లగా అనే సినిమా కోసం అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ మధ్య వదిలిన కొన్నిపోస్టర్లు తెగ హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఓ చిన్న ఝలక్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ అదిరిపోయే ప్రోమోను షేర్ చేసింది. ఇందులో అనసూయ తన అందాలను కుర్రకారును కట్టిపడేసింది.
మామూలుగానే అనసూయ తన హాట్ హాట్ అందాలు, అదిరిపోయే స్టెప్పులతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. అలాంటి అనసూయ ఐటెం సాంగ్ చేస్తుందంటే ఎంతటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. అయితే వాటికి తగ్గట్టే చావు కబురు చల్లగా అనే సినిమాలో అదిరిపోయే మాస్ సాంగ్కు స్టెప్పులు వేసింది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదల చేశారు. ఇందులో అనసూయ తన లుక్కుతో చంపేసింది.

హీరో కార్తికేయ చావు కబురు చల్లగా చిత్రంతో మంచి హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇప్పటి వరకు వదిలిన పాటలన్నీ ఒకెత్తు అయితే.. అనసూయ స్పెషల్ సాంగ్ మరో ఎత్తు అయ్యేలా ఉంది. పైన పటారం ఈడ లోన లొటారం అనే పాట అదిరిపోయింది. ఇందులో అనసూయ వేసిన స్టెప్పులు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. అందుకే ఈ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











