Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హైప్ క్రియేట్ చేస్తున్న 'చావు కబురు చల్లగా' మాస్ సాంగ్.. హిట్టు కొట్టేలా ఉన్నారు
ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్స్ లు అందుకుంటున్న హీరోయిన్స్ లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అయితే అందంతో నటనలో ఈ హీరోయిన్ కు మంచి మార్కులే పడుతున్నాయి గాని బాక్సాఫీస్ వద్ద సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. ఇక ఈ సారి 'చావు కబురు చల్లగా సినిమాతో' హిట్ కొట్టేలా ఉందని అనిపిస్తోంది. ఆమెతో పాటు హీరో కార్తికేయ కూడా ఆ సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
ఇక సినిమాకు సంబంధించిన ఒక పాటను ఇటీవల రిలీజ్ చేయగా అది వైరల్ గా మారింది. మై నేమ్ ఈజు రాజు.. అంటూ సాగే ఆ టైటిల్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. సినిమాకు సంబంధించిన హీరో క్యారెక్టర్ ను చాలా వివరంగా చెబుతున్నట్లు అర్ధమవుతోంది. అప్పుడే ఆ సాంగ్ 1 మిలియన్ వ్యూవ్స్ ను అందుకొని సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు.
మార్చ్ 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఫన్నీ పోస్టర్ ద్వారా ఇటీవల తెలియజేశారు. అందులో హీరో కార్తికేయ బైక్ ముందు భాగంపై కూర్చొని ఉండగా లావణ్య త్రిపాఠి వెనకాల నవ్వుతూ కూర్చొని ఉంది. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా పెద్దగా పోటీ లేని సమయంలోనే రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరి స్టార్స్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.