Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
థమన్ తరహాలోనే బాలీవుడ్ పై దేవిశ్రీప్రసాద్ అసంతృప్తి.. షాకింగ్ కామెంట్స్
సంగీత దర్శకులలో ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్ ఇద్దరు కూడా పోటాపోటీగా మ్యూజిక్ అందిస్తున్నారు. వీరు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. కేవలం పెద్ద సినిమాలను మాత్రమే కాకుండా చిన్న సినిమాలను కూడా చేస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పుష్ప సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం థమన్ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. మంచి ప్రాజెక్ట్స్ సెట్టయితే అన్ని భాషలో కూడా సినిమాలు చేయాలని ఈ సంగీత దర్శకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తుండడంతో అక్కడ కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా అక్కడ సినిమాలు చేయడానికి ఈ ఇద్దరు ఒప్పుకోవడం లేదు. గతంలో థమన్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో ఒక సినిమాకు ఇద్దరు లేదా ముగ్గురు సంగీత దర్శకులు కొనసాగుతున్న. ఒక సినిమాకు ఉండే ఐదారు పాటలకు ముగ్గురు నలుగురు విడివిడిగా సాంగ్స్ చేస్తున్నారు. ఇక మరొకరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇలాంటి ప్రక్రియలో సినిమాలకు మ్యూజిక్ అందించడం తనకు ఏమాత్రం నచ్చదని పెళ్లి ఒకడి తో శోభనం ఇంకొకడితో అన్నట్లుగా ఉంటుంది అని థమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. చేస్తే ఒక సినిమాకు పూర్తిగా ఒక్కడినే మ్యూజిక్ చేయాలని ఉందని వివరణ ఇచ్చాడు. ఇక ఇటీవల దేవిశ్రీప్రసాద్ కూడా అదే తరహాలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాకు సంబంధించిన ఒక పాట వస్తే మంచి విజయాన్ని అందుకుంటాయి. అయితే ఆ పాటకు ఎవరు మ్యూజిక్ అందించారు అనే విషయాన్ని మనం అంత ఈజీగా కనిపెట్టలేక పోతున్నామని అందుకు కారణం ఒక సినిమాకు నలుగురు ఐదుగురు సంగీతం అందించడమే నని తెలియజేశారు.
తనకు కూడా గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి అని.. కాకపోతే ఒకటి లేదా రెండు పాటలను మాత్రమే కంపోజ్ చేయడం ఇష్టం లేదని అన్నాడు. చేస్తే ఒక సినిమాకు మొత్తం సంగీతం అందించాలని ఉన్నట్లు అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు తప్పకుండా బాలీవుడ్ సినిమా చేస్తాను అని దేవి శ్రీ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఒక విధంగా దేవిశ్రీప్రసాద్ థమన్ ఇద్దరు చెప్పింది కూడా కరెక్ట్ అయినప్పటికే బాలీవుడ్లో మాత్రం ఒక ట్రెండ్ అయితే నడుస్తోంది. ఒక సంగీత దర్శకుడు అన్ని పాటలను కరెక్టుగా ఇవ్వలేడు అని అందుకే ఒకరిపైనే భారం పడకుండా అన్ని పాటలు సక్సెస్ అవ్వాలంటే ఒక్కొక్కరితో ఒక్క పాటను తీసుకోవాలని అప్పుడే చాలెంజ్ గా పని చేస్తారని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప సినిమా పాటలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను అందుకున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ లోనే 70 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.