Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనాపై మరో వినూత్న సందేశం.. దేవీ శ్రీ ప్రసాద్ టాలెంట్
ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. రోజురోజుకూ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. మన దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత యాభై రోజులుగా లాక్ డౌన్ పాటిస్తున్నా.. కరోనా మాత్రం విస్తరిస్తూనే ఉంది. కరోనాపై అందరికీ అవగాహన కలిగించడం, కరోనాపై పోరాటం చేసేందుకు కావాల్సిన శక్తి, బతికేందుకు గల ఆశను పాటల రూపంలో ప్రజలకు రచయితలెందరో చెబుతున్నారు.
కరోనాపై అవగాహన, కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యుల సేవలను కీర్తించేందుకు, కరోనాతో భయబ్రాంతులకు గురైన వారిలో తిరిగి ఆశలు నింపేందుకు ఇలా ఎన్నో రకాలుగా పాటలను స్వరపరిచి అందించారు. వీరిలో కోటి, ఆర్జీవి, కీరవాణి, చంద్రబోస్, మంచు మనోజ్ వంటి వారెందరో ఉన్నారు. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ తనలోని మరో ప్రతిభతో కరోనాపై పరోక్ష సందేశాన్ని ఇచ్చాడు.,
కరోనా వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారిపోతాయని, త్వరలోనే అంతా చక్కబడుతుందనే ఆశను చిగురించేందుకు ఎంతో మంది ఎన్నో రకాల సందేశాలిస్తున్నారు. ఈ క్రమంలోనే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తనలోని ఫోటోగ్రాఫర్ను తట్టి లేపాడు. చంద్రుడు ఫోటోలను తీస్తూ.. అందులో ఓ సందేశాన్ని ఇచ్చాడు. ' ఫోటోగ్రఫీ అంటే నాకిష్టమని మీలో కొద్దిమందికి తెలుసు.. కానీ టైమ్ లాప్స్ ఫోటోగ్రఫీపై ఇష్టమని ఎంతమందికి తెలుసు?.. బుద్దపూర్ణిమ నాడు తీసిన కొన్ని షాట్స్తో ఎడిట్ చేసిన వీడియో.. ఆశ చిగురించేలా' చేసేందుకు అని ట్వీట్ చేశాడు. దేవీ ప్రస్తుతం అల్ల అర్జున్-సుకుమార్ పుష్ప సినిమాకు సంగీతాన్ని సమకూర్చడంలో బిజీగా ఉన్నాడు.