Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దుమ్మురేపుతున్న రౌడీ బేబీ.. ధనుష్, సాయిపల్లవి పాట సంచలనం
తమిళ స్టార్ హీరో ధనుష్, అందాల తార సాయి పల్లవి నటించిన మారి2 చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ సినిమాలో పాటలు మాత్రం సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో వైరల్ అయ్యాయి. మారి 2 సినిమాలోని పాటలు సినీ అభిమానులను పిచ్చెక్కించాయి. యువన్ శంకర్ సంగీత దర్శకత్వంలో ధనుష్, డీ పాడిన రౌడీ బేబీ పాట అన్ని వర్గాల సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించింది. ఆ పాటకు ప్రభుదేవా నృత్యం సమకూర్చడం గమనార్హం.
రౌడీ బేబీ పాట కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఒక్క యూట్యూబ్లోనే ఈ పాట 600 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ రేంజ్లో వ్యూస్ను సొంతం చేసుకోవడం దక్షిణ భారతంలో ఇదే మొదటిసారి.
2016లో విడుదలైన మారి సినిమాకు సీక్వెల్గా మారి 2 వచ్చింది. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. 2018లో డిసెంబర్ 21న రిలీజైన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఇక ఈ పాట టిక్ టాక్ సోషల్ మీడియా యాప్లో స్వైర విహారం చేస్తున్నది. ఈ పాటకు ఆర్య, సాయేషా కూడా తమ పెళ్లిలో డ్యాన్స్ చేయడం మరింత వైరల్గా మారింది.
Unstoppable 🤩
— Wunderbar Films (@wunderbarfilms) August 13, 2019
600 MILLION BABY!#RowdyBaby #Maari2
🎵https://t.co/FMrdiRwd70 @dhanushkraja @Sai_Pallavi92 @thisisysr @directormbalaji @PDdancing @AlwaysJani @vinod_offl @divomovies @RIAZtheboss #RowdyBabyHits600MViews pic.twitter.com/ggOnoiSoxS
ఇంత క్రేజీ పాట ఉన్న మారి2 సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ సాయిపల్లవి డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత కొద్దినెలలుగా యూట్యూబ్లో టాప్ స్థానంలో కొనసాగడం సాయిపల్లవి మహిమే అంటున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఇక ధనుష్ కెరీర్ విషయానికి వస్తే, వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే అసురన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనంతరం కార్తీక్ సుబ్బరాజ్తో తీసే సినిమాలో ధనుష్ నటిస్తారు.