Lata Mangeshkar మీద విష ప్రయోగం.. బెడ్ మీద ఉండగానే అలా.. అసలేమైందంటే?
తన పాటలతో కోట్లాది హృదయాలకు దగ్గరైన స్వర కోకిల లతా మంగేష్కర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతరత్న అవార్డు పొందిన బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన ఆమె ఆదివారం కన్నుమూశారు. లతా మంగేష్కర్ తన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో గుర్తుండిపోయే పాటలను అందించారు. అయితే ఆమెను ఒకప్పుడు స్లో పాయిజన్ ఇచ్చి చంపే ప్రయత్నం జరిగిందని కొందరికే తెలుసు.అసలు ఆమెను ఎవరు చంపాలని ప్రయత్నించారు? ఎందుకు ప్రయత్నించారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విషప్రయోగం
స్వర కోకిల లతా మంగేష్కర్ మన మధ్య లేరు. ఫిబ్రవరి 6 ఆదివారం, అతను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచాడు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ఆమె మృతితో సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తనకు విషప్రయోగం జరిగిందని లతా మంగేష్కర్ స్వయంగా వెల్లడించారు.

కదలలేని పరిస్థితి
తన సింగింగ్ కెరీర్లో అత్యంత విజయవంతమైన దశలో తనకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు లత ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు . లతకు విషప్రయోగం జరిగిన ఈ ఘటన 1963లో జరిగింది. ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను దాని గురించి మాట్లాడను, కానీ ఇది నా జీవితంలో ఒక భయంకరమైన దశ. అని అన్నారు. అది 1963 సంవత్సరం, నేను చాలా బలహీనంగా అయిపోవడం నాకు ఆరాధిం అయింది. నా మంచం నుండి లేవలేదు. స్వతహాగా నా అంతట నేను కదలలేని పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు.

33 ఏళ్ల వయసులో
విషం తీసుకోవడం వల్ల మూడు నెలలు మంచంపైన ఉన్నానని లతా మంగేష్కర్ తెలిపారు. నాకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. డాక్టర్ కపూర్ చికిత్స మరియు నా దృఢ సంకల్పం నన్ను ఈ బ్యాడ్ స్టేజ్ నుండి బయటికి తీసుకొచ్చాయని ఆమె వెల్లడించారు. లతకు ఈ ఘటన జరిగినప్పుడు ఆమె వయసు 33 ఏళ్లు. ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చిందట.

విషం పెట్టిందెవరో ?
అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటంటే, ఆమె తాను పడుకున్న ప్లేస్ నుంచి కదలడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటికే లతకు వాంతులు రావడంతో శరీరం మొత్తం వణికిపోయింది. ఆ తర్వాత లతకు విషప్రయోగం జరిగిందని తేలింది. అయితే లతా మంగేష్కర్పై విషం పెట్టిందెవరో ఆమెకు తెలుసుట. ఎందుకంటే లత మంగేష్కర్ అస్వస్థతకు గురికావడంతో ఆమె వంట మనిషి హఠాత్తుగా కనిపించకుండా పోయిందని చెబుతున్నారు.
Recommended Video

ఎందుకు ?
అంటే ఆమే ఈ విషం ప్రయోగం చేసినట్టు లతా మంగేష్కర్ వెల్లడించారు. అయితే ఎందుకు ? అలా చేసింది అనేది మాత్రం తెలియలేదు. కెరీర్ లో పీక్స్ లో ఉండగా ఆ ప్రయత్నం చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేనందున అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని లత తెలిపారు. ఈ ఘటనతో లత కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అప్పుడు లతా మంగేష్కర్ చెల్లెలు ఉషా మంగేష్కర్ ఆ ఇంటి వంటగది బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











