Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రొమాంటిక్గా మహేష్.. కేక పెట్టిస్తున్న మహర్షి సాంగ్.. ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే’ అంటూ..
Recommended Video
సూపర్స్టార్ మహేష్ హీరోగా.. సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడో విడుదల చేయగా అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.. ఆ పాట ఎలా ఉందంటే..
మూడో పాట కూడా వైరల్గా
ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే', ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' పాటలకు కూడా అద్భుతైమెన స్పందన వస్తోంది. కాగా, ఈ చిత్రంలోని ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..' అంటూ శ్రీమణి రాసిన మూడో పాటకు సంబంధించిన వీడియో ప్రివ్యూను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తున్నది.
ఎవరెస్ట్ అంచున పూసిన పువ్వే
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే అంటూ చక్కని బీట్తో సాగే ఈ పాటలో మహేష్, పూజా హెగ్డే వేసిన స్టెప్స్కి అభిమానులు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 9న సమ్మర్ స్పెషల్గా వరల్డ్వైడ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
మే 9న విడుదల
మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి విడుదలైన తేదీని సెంటిమెంట్గా చేసుకొని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మే 9న వరల్డ్వైడ్గా ఈ చిత్రం విడుదల కానున్నది.