Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'తందానే తందానే' వచ్చేసింది.. హృదయాన్ని హత్తుకునేలా 'వినయ విధేయ రామ' తొలిపాట!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను ఎప్పటిలాగే మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షూరూ చేశారు. ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని సంగీతం అందించాడు.
తందానే తందానే
తందానే తందానే అంటూ సాగే ఈ పాట వినగానే నచ్చేసే విధంగా ఉంది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పాటలో దేవిశ్రీ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సన్నివేశాల నేపథ్యంలో ఈ పాటని రూపొందించారు. లిరికల్ వీడియో ఈ పాట నేపథ్యాన్ని వివరించేలా కొన్ని స్టిల్స్ చూపించారు. సందర్భానికి తగ్గట్లుగా శ్రీమణి రాసిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. గాయకుడు ఎంఎల్ఆర్ కార్తీకేయన్ వినసొంపుగా ఈ పాటని పాడారు.
పండగ వాతావరణం
రాంచరణ్, అతడి కుటుంబ సభ్యులంతా గుడిలో పూజ కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో ఈ పాటని రూపొందించారు. పాట చిత్రీకరణ కలర్ ఫుల్ గా సాగినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ పంచెకట్టుతో అదరగొట్టుతున్నాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, నటుడు మధు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఈ సెటప్ మొత్తం చూస్తుంటే బోయపాటి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
తొలి కాంబినేషన్
బోయపాటి సినిమాలు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయో.. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రంలో రాంచరణ్ కు సోదరులుగా తమిళ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను, రాంచరణ్ తొలి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. రాంచరణ్ రంగస్థలం తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సంక్రాంతి కానుకగా
డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.