Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హాట్ హాట్ స్టెప్పులతో ఊపేసిన అప్సర రాణి: ‘సిటీమార్’ కోసం పెప్సీ రాణిలా మారిపోయింది
చాలా కాలంగా సరైన విజయం దక్కక ఇబ్బందులు పడుతున్నాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. కానీ, ఒక్కటంటే ఒక్క హిట్ను కూడా అందుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నందితో 'సీటీమార్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే మాస్ నెంబర్ను తాజాగా విడుదల చేసింది యూనిట్.
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)
'సీటీమార్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గతంలోనే ఓ పాటను వదిలారు. ఇప్పుడు 'పెప్సీ ఆంటీ' అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసి.. 'క్రాక్' సినిమాలో స్పెషల్ సాంగ్తో అలరించిన అప్సర రాణి.. ఇందులో మరోసారి అలరించింది. అదిరిపోయే మాస్ సాంగ్కు హాట్ హాట్ స్టెప్పులతో మరింత వన్నె తెచ్చింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను కీర్తన శర్మ ఆలపించగా.. డైరెక్టర్ సంపత్ నంది స్వయంగా లిరిక్స్ అందించాడు.
గోపీచంద్ కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సీటీమార్'ను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇందులో హీరోయిన్గా చేస్తోంది. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. గోపీచంద్తో పాటు తమన్నా కూడా కబడ్డీ కోచ్గా నటిస్తోంది. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.